యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

16, జులై 2013, మంగళవారం

ఏకైక నాయకుడు ఈనాటికీ

ప్రొ.జయశంకర్ వోడవని ముచ్చట నుండి

ఏకైక నాయకుడు ఈనాటికీ


        చెన్నారెడ్డికి, చంద్రశేఖరరావుకు ముఖ్యంగా(తేడా) ఎందంటే, ఇష్యూను సమగ్రంగ అర్ధం జేసుకోటంలో చెన్నారెడ్డి అంత శ్రద్ధ జూయించే వాడుగాదు. మాతో యెవ్వరు బెట్టుకుంటరయ్యా... ఇవన్ని. లొల్లి బెట్టాలి గని ఈ లెక్కలు ఎవడికి గవాలె...  అట్ల పెద్దగ వినేటోడు గాదు. అయిన గాని నేను జెప్పేది జెప్పేది. వుండె, అట్ల వుండె.. ఆయనకా స్టేచర్ వుండె. ఈయన అట్ల గాదు, విషయ పరిజ్ఞానం లేంది మాట్లాడొద్దు. క్రిటికల్ గ ఆలోచించాలె. నాతోని యాడాది గూసున్నడాయననేర్చుకోడానికి. టిడిపి లో వున్నపుడు యాడాది గూసున్నడు. ఎందుకు గూసోవాలే నా యెంబడి? గిట్ల... ఇట్నే గూసునేది. ప్రతిదానికి క్వశ్చన్, క్రాస్ క్వశ్చన్ జెస్తుండె.


రెండవది సమస్యను అర్ధం జేసుకొని ప్రజల నుడికారంతో, ప్రజల భాషతో, ప్రజల్లోకి ముందుకు దీసుకపోయినటువంటి... నా దృష్టిలో ఏకైక నాయకుడు ఈనాటికీ. నాన్ పొలిటికల్ దాంట్లో ఆ స్కిల్, ఏది?  ప్రజల భాషలో పోయి మాట్లాడె స్కిల్ నాకు ఒక్క కోదండరాంలో కనపడతది. నాలో లేదు ఆ స్కిల్. నేను ప్రజల భాషలో మాట్లాడలేను, మాట్లాడుత గాని ఆ నుడికారం రాదు. ఇపుడు నేర్చుకుంటె ఆర్టిఫిషియల్ అయితది. నా పద్ధతిలో నేను జెపుత. అంతేగాని నిజంగా ప్రజల నుడికారంలో పొగలిగిన రాజకీయ నాయకుల్లో ఏకైక నాయకుడు ఈనాటికీ చంద్రశేఖరరావు వొక్కడె. నాన్ పోలిటికల్ గ వచ్చేదాంట్లో కోదండరామే. ఆ విట్.. ఏందంటె ఆ యాక్సెంటె.. బాగున్నారే అన్న! అంటరు, బాగున్నవ సార్! అని నేనంట. తేడా కనబడుతది కదా. నేను కొత్తగ అది అంటె ఆర్టిఫిషియల్ అయితది.

కామెంట్‌లు లేవు: