యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

14, జులై 2013, ఆదివారం

"నాదీ తెలంగాణే" కిరణ్ పెద్ద వంచన

"నాదీ తెలంగాణే" "తెలంగాణా ప్రజల మనోభావాలు తెలుసు " 



"ఆంధ్ర మంట" పత్రికలో వచ్చిన వార్తలో ఎంత అసంగతమైన విషయాలు ఉన్నాయి.



 అసలు "నాదీ తెలంగాణే" అనే మాట కిరణ్ కుమార్ రెడ్డి అని వుంటే అంతకంటె మోసం, వంచన ఉండదు.



          "మేడమ్... 2009లో కెసిఆర్ ఎందుకు నిరాహారదీక్ష చేసారు? హైదరాబాదులొ పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన 14ఎఫ్ తొలిగించాలనె  డిమాండుతో నిరశన దీక్షకు దిగారు. కానీ... డిల్లీలో బయపడిపోయి ఏకంగా తెలంగాణా ఇస్తామంటూ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయగలిగింది అందువల్లే కదా!" అని కిరణ్ ప్రశ్నించాడట. 

         మరి ఆంధ్ర నాయకుల(రోశయ్య,బాబు,చిరంజీవి) నాయకత్వంలోని పార్టీలు 7డిశంబరు ,2009న  అఖిల పక్షం సమావేశంలో  తెలంగాణా బిల్లు పెట్టమని ఎందుకు తీర్మానించినట్లు? కిరణ్ అప్పుడు ఏమి చేసినట్లు? తెలివిలేదనుకుందామా? ఇప్పుడు ఈ విధంగా మాట్లాడటం మోసం కాదా? కెసిఅర్ దీక్ష తర్వాత తెలంగాణ లో తెలంగాణ ఆకాంక్ష బయటికి వచ్చింది నిజం కాదా? ఇప్పుడు సమైక్య నినాదం తో తెలంగాణాలో ఒక్క పార్లమెంట్ సీటుపోటీచేసి   చూడమను "తెలంగాణా ప్రజల మనోభావాలు" తెలుస్తాయి. 

        "వైఎస్ మరణం తర్వాత తలెత్తిన పరిస్తితులవల్లె ఈ పరిణామాలన్నీ జరిగాయి. లేని పక్షంలో టీఅర్ఎస్ ఉనికే ప్రశ్నార్ధకంగా మారెది.ఇప్పుదు కూడా కేవలం నాలుగు జిల్లాల్లోనే టీఆర్ఎస్ ఉనికి బలంగా ఉంది."


          వైఎస్ మరణం తర్వాత చాల పరిణామాలు జరిగినాయి. మంచి పరిణామాలు జరిగినాయి. అవి ఆయన అవినీతి బయటికి వచ్చింది. కొడుకు జైలుకు పొయిండు . మంచి పరిణామమా?కాదా? అదేవిదంగా తెలంగాణా ఆకాంక్ష బయటకు వచ్చింది. బలపడింది. ఇది కూడా మంచి పరిణామమా? కాదా?  వైఎస్ బ్రతికున్నప్పుడు తెలంగాణ ఆకాంక్షను మోసంతో, బెదిరించి, అవినీతి డబ్బు ఆశ చూపి అనగదొక్కినది నిజంకాదా?


     "నదిపరివాహక ప్రాంతాలు, తెలంగాణాలో ఎత్తిపోతల ప్రాజెక్టులు, వాటికి అవసరమయ్యే విద్యుత్తు, నీటిసమస్యలు, సంఘర్షణలు తలెత్తే అవకాశాలు, కృష్ణా డెల్టాలో ఆహార ధాన్యాల ఉత్పత్తి మొదలైన అనేక విషయాల గురించి ఆయన(కిరణ్)గణాంకాలు, మ్యాప్లతో వివరించారు. ........."  విడిపోతే వచ్చే సమస్యలు ఏకరువు పెట్టాడట. 

        ఇవి ఇప్పుడున్న సమస్యలె తెలంగాణకు. వీటి పరిష్కారం కొరకె విడిపోవడం.  దీనిని అటుదిటు తిప్పి చెప్పడం మోసం కాదా? తెలంగాణ  నీళ్ళు దొసుకెల్లుతున్నరు,తెలంగాణ ఎత్తిపోతల ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నరు.  ఎత్తిపోతల ప్రాజెక్టులకుఅవసరమయ్యే విద్యుత్తు గురించి ఆలోచన లేదు. సమస్యలు తెలంగాణకు మిగిల్చి, అన్ని ఆంధ్రకుదోసిపెట్టడానికే  విడిపోవద్దు అంటున్నరు.    



2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Telangana water? If the upper states thinks the same way what will happen to Telangana? Water is shared between nations, not only states in India.

Think twice before you say something ;)

అజ్ఞాత చెప్పారు...

hello agnatha,
telangana water means the legal share of the river water for telangana, it doesn't mean the whole river. It is natural that a state cannot obstruct rivers for 100%. The river water has to reach its end in the sea. There are clear guidelines and tribunals to allocate water to states. Each state will get its due even after separation.