ప్రొ.జయశంకర్
గారి “వొడవని ముచ్చట” నుండి
కాంటెంపరరీ పాలిటిక్స్ లో అట్ల లేకుంట బతకలేడు
ఇపుడు మీరన్నరు అందరు..... తాగుతడు అని. అందరికి అలవాట్లు ఉంటయ్. ఈయన
మీదనె ఎందుకు వచ్చింది? అలవాట్లు అందరికి వుంటయ్ గద! అది
చెప్తి గద. పోలిటికల్ గ క్రిటిసైజ్ జేయడానికి ఏదోక ఆయుధం గావలె. ఈయన ఓపెన్ గ తాగుతడు
గనక ఆయుధం అయ్యింది. మిగతా వాళ్లందరు తక్కువ తాగుతారయ్య! నేను జూసిన చాలా మంది
తాగి తందానలాడి స్పృహతప్పి పడిపోయినవాల్లు. నైట్ల ఇంట్ల వుంటరు. బయటకిరారు. అలాంటి
వాల్లుంటరు. ఈయన అట్ల గాదు డ్రాయింగ్ రూంల కూర్చొని…. అడిగిన నేను,
సార్! ఇండ్ల రహస్యం యేమున్నది, గుస గుస ఏముంది. తప్పైతె
తప్పే, ఒప్పైతె ఒప్పే. వొకడు గెస్ట్ వచ్చిండు ఆఫర్ జేస్తం.
వాళ్ళు ఇగ ఎట్ల వుంటదంటె, ఈ వచ్చే మనుషులకు, సరకు జెప్తున్న నేను! కొంతమందికి, కేసీఆర్ దగ్గర కూర్చొని తాగిన అని చెప్పుకోవాలె బయట! అయితే ఏం జేస్తరు? ఆ గ్లాస్ పట్టుకొని బయటికి బోయి మల్లోస్తరు, చెప్తున్న. ఇవి అబ్జర్వ్ జేసి
చెప్తున్న. వీడు తాగేతోడు బయటికి ఎందుకు బోవాల్నయ్య? లోపలికి రమ్మంటి, వస్తివి, గ్లాసిచ్చే, అది బట్టుకొని బయటికి బోయి... బయట
వున్నోల్లందరికి దెలవాలె, కేసీఆర్ తో కూచోని తాగుతున్నా అని.
జెప్తున్న... రాంగ్ సిగ్నల్స్ అట్ల బోతయ్. కొన్ని సంఘటనల తర్వాత
బంద్ జేసిండు. అది వేరు విషయం.
క్యారెక్టర్స్, ఇపుడు ఒకటేందంటె
దీన్ని కేవలం పొలిటికల్ యాక్టివిటీగ జూసే వాల్లకు ఇంపార్టెంట్ గాదు. అది పొలిటికల్
యాక్టివిటీ అయితది. అన్ని పర్వర్షన్స్ వస్తయ్. ఉద్యమం మాత్రమె అనుకొనేవాల్లతోని నిలిచింది
ఇది. ఉద్యమం మాత్రమే అనుకొనే వాల్లు చాల మంది వున్నరు. కొందరి పేర్లు బయటికి
రావొచ్చు,
రాకపోవచ్చు. ఎంత మంది విద్యావంతులు, ఎంతమంది స్కాలర్స్
ఎంతమంది పనిజేయలేదు! సైలెంటుగ జేసిండ్రు. నాకు ప్రాచుర్యం వచ్చింది అది వేరు
విషయం. పనిజేసిన వాల్లున్నరు. పొలిటికల్ గ వచ్చేవానికి వాని పొలిటికల్ ఎజెండానె వుంటది.
వాని ఉద్యమాన్నె వాని పొలిటికల్ ఎజెండాగా వాడుకోవాలి.
ఒకటేందంటె స్టడీ, బేసిక్ స్టడీ.
రెండవది తత్వం! ఆయనది అగ్రెసివ్ నేచర్. తత్వం అగ్రెసివ్. ఇపుడు ఆయన మాలాంటి వాల్లతో ఎంత నమ్రతతో మాట్లాడుతాడో, పొలిటికల్ గ అంత
అగ్రెసివ్ గ వుంటడాయన. అది విశేషం. ఒక మనిషిలో రెండు యాస్పెక్ట్స్ జూసీన్నేను. మేం కూర్చొని మాట్లాడితె చాలా
నమ్రతతో అట్లగాదు సార్, ఇట్ల గాదు దీన్ని విభేదిస్తే ఎట్ల? ఇట్ల ఎందుకు
గాదు సార్? అంటడు. వేరే వాళ్ళు విభేదిస్తే యాయ్ నీకేం తెలుసు
ఊకో అంటడు, చెప్తున్న, రెండూ జూస్త నేను. ఎదుటి
వాన్ని బట్టి వుంటది ఆయన ప్రవర్తన. అది మంచా, చెడా అనే తత్వం ఆయనది. పొలిటికల్ గ వెరీ అగ్రెసివ్ మ్యాన్. అట్ల లేకుంటె
బతకలేడు. నోటిగదర్తొ బతికిండు గదయ్య. మంచిదా, చెడ్డదా అది వేరు
విషయం. బతికిండు గద. మరి మేం ఆ పని జేయ లేదు. అందుకనే పొలిటికల్ గ పనికిరాం మేం!
వేరేవాల్లని యెదగనీయడు అంటె, అది మరి ఈ ప్రశ్న
వాల్లనే అడగాలి. నేను అదే అడిగిన. ఐతె మీరు జేయండి, లేకపోతె
కలవండి, లేకుంటె ఊరుకోండి. ఈ దాగుడు మూతలు ఎందుకు? ఎందుకు అంటె నిజంగ ఈ ఎత్తున వాల్లకు జేయ శాతకాదు,
రెండోడు, ఇంకోడు జేసి వాడు పైకి బోవద్దు. వాల్ల పేరు జెప్పి
మేం పైకి రావాలె. వాళ్ళిచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొ మేం పైకి రావాలె! లోపం అక్కడున్నది. మీటింగ్
పెడితె మందిని పంపాలె, పైసలియ్యాలె, జన సమీకరణ జెయ్యాలె, తిట్లు దినాలే వీళ్ళతోని. ఐతె కలసి జేయండి, లేకపోతె
దూరం వుండండి. మిమ్మల్ని జెయ్యంగ ఆపుతారయ్య ఎవరన్న? వద్దంటరా?
ఉద్యమంలోకి వస్తున్న వాన్ని
ఎట్లాపుతామయ్య?ఎట్ల క్వశ్చన్ జేస్తవ్? ఎవడెంది ఎట్ల దెలుస్తది! ఈయన బాగనే జేసిండు, ఈయనగూడ మంచిగనే
జేసిండు. అయ్యేవరకు యాంబిషన్ బెరిగింది. యాంబిషన్ పెరిగేసరికి ఇవన్ని
సమస్యలు... మామూలు విషయమానయ్య?
ఒకటేందంటె యాంబిషన్, అనుకున్న దాని కంటె
ఎక్కువ పైకి పోవాలె, ఆయన కొడుకు మినిస్టర్ అయ్యిండు, నేను ఎందుకు గావొద్దు, అల్లుడు మినిస్టర్ అయ్యిండు, నేనెందుకు గావోద్దు, చెప్తున. పర్సనల్ కోరికలు, పొలిటికల్ ఎజెండా. మరి ఎల్లిపోయి చేయగలిగింది ఏమన్న ఉందా అంటె, ఏమి లేదు. ఊరికే తిట్టడం, విమర్శించడం నడుస్తనె
వుంటది అది.
ఒకటేమైందంటె ఇనీషియల్ గ, తెలంగాణకు తెలంగాణ భూస్వామ్య
వర్గాలు అడ్డం వచ్చినయ్. ఫస్ట్ స్టేజిలో చెన్నారెడ్డి పిరియడ్ అప్పుడు. వాల్లకె ఇష్టం
లేకుండె. టోటల్ గ భూస్వామ్య
వర్గాలె. అపుడేమయిందంటె పవర్ ఫుల్ కాంబినేషన్. తెలంగాణ, రాయలసీమ భూస్వామ్య వర్గాలేవైతె
వున్నయో, ఆ కులం అయితె చాల పవర్ఫుల్ కాంబినేషన్ అయింది. సంజీవరెడ్డి
తెలంగాణ వాల్లని బుట్టలో ఏసుకున్నడు. వీల్లకి ఏమైందంటె వీల్ల ఇంట్రస్ట్ లు కాపాడుకోవాలె.
పి.వి.నరసింహారావు పెట్టినటువంటి భూసంస్కరణల చక్కర్లకెల్లి బయటపడాల్నంటె, వాల్ల సపోర్ట్ అవసరం. కనుక ఇక్కడ భూస్వామ్య వర్గాలన్నింటికి ఆ రాయలసీమ పాట్రన్
దొరికింది. అదొకటి. నా అంచనాలో భూస్వామ్య వర్గాలె పెద్ద ప్రతిబంధకం అపుడు వుండె. తర్వాత
ఏం జరిగింది ముఖ్యంగ ఎన్.టి.ఆర్. వచ్చిన తర్వాత ఈ కమ్మ బిజినెస్ ఇంట్రెస్ట్ ఇక్కడ పెరిగినపుడు, తెలంగాణ సెకండ్ రేట్ లీడర్స్ అందరినీ వాల్ల బుట్టలో ఏసుకున్నడు. ఈ రియల్ ఎస్టేట్
పేరుతో, ఫిలిం ఇండస్త్రి పేరుతో, వ్యాపారాల
పేరుతో తెలంగాణలొ వున్నటువంటి ఆ రెడ్డి వర్గాన్ని గాదని ఈ ఎస్.సి., బి.సి.లను కొంత మందిని బెట్టుకొని సెకండ్ రేట్ వాల్లను బుట్టలో ఏసుకొనే వరకు, ఆ బిజినెస్ ఇంట్రస్ట్ బెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హైదారాబాద్
లొ ఈ మంత్రులందరు అదే గద. అదే ప్రతిబంధకం.
మూడవ దశ వచ్చే వరకు ఏందంటె ఈ కులాల ప్రస్తావన
చాల వచ్చింది. అగ్రవర్ణాలతో ఒకసారి, బలహీన వర్గాలతో మరొకసారి ఒక్కొక్క దశలో ఒక్కొక్క ప్రతిబంధకమైంది. కని ఈ రోజు
ఏమైంది అంటె సమగ్రత వచ్చింది. భూస్వామ్య వర్గాలలో కూడా తెలంగాణ గావలంటున్నరు, బిజినెస్ వర్గాల వారు గావలంటున్నరు. సామాజికంగా ఎన్ని చీలికలు వున్నా గావలంటున్నరు.
పెద్ద ప్రాసెస్ ఇది. ఈ రోజు సమగ్రత వచ్చింది. కనుకనే ప్రజల్లోకి బోయింది. దీనికి పెద్ద
కొలమానం మొన్న బై ఎలక్షన్స్. తెరాస కొరకు ఏసినారయ్య ఓట్లు? మన
తెలంగాణ కొరకేసిండ్రు వాల్లు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి