యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

27, జులై 2013, శనివారం

తెలంగాణ – సీమాంధ్ర – సామాజిక న్యాయం

ప్రొ.జయశంకర్ వోడవని ముచ్చట నుండి

విడిపోతే సాధ్యం అయిద్ది

     వస్తది.. ఇపుడు ఎందుకొస్తదో చెప్త, అక్కడికే వస్తున్న. సామాజిక న్యాయం.. ఇపుడు ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం ఎందుకవుతున్నాయని జెప్తున్నమంటె, 50, 60 ఏండ్ల నుంచి తెలంగాణలో వచ్చిన ఉద్యమాలు, అప్పటి సాయుధ పోరాటమే గావొచ్చు, నిజాం వ్యతిరేక పోరాటమె గావచ్చు, నక్సలైట్ ఉద్యమం గావచ్చు, కులసంఘాలు గావొచ్చు, తెలంగాణ ఉద్యమం గావొచ్చు... ఇయన్నిటితో జనచైతన్యం బెరగలేదా? వట్టిగ బోతదయ్య? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనేది సాధ్యం కాదు, విడిపోతె సాధ్యం అయిద్ది. ఎట్ల అన్నప్పుడు చెప్త విను. 50, 60 ఏండ్ల చరిత్ర లోపల, సరె బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం అంటె దానికి ఏంటి కొలమానం? కొలబద్ద ఏమిటి? నా దృష్టిలో అ వర్గాలనుంచి ఎదిగి వచ్చి, ముఖ్యమంత్రి గావాలె, తర్వాత ప్రధానమంత్రిగ నిలదొక్కుకోవాలె, జరిగిందా? ఒక్క సంజీవయ్య 18 మాసాలు, ఆయన గాలె, తీసుకొచ్చి కూసోబెట్టిండ్రు. ఆయన ఎక్కువ జేసేవరకు తీసేసిండ్రు. తర్వాత ఎవడన్న అయ్యిండా? కానిస్తరా? కానివ్వరు.  ఇపుడు ఏ పార్టీ అయిన దీసుకో, కాంగ్రెస్ పార్టీ అంటె మల్ల గదే రాజశేఖరరెడ్డా, విజయభాస్కరరెడ్డి కొడుకులా, లేకపోతె పురంధేశ్వరా, జైపాల్ రెడ్డా... గీల్లే గదా? టిడిపి అంటె సింగిల్, కమ్యూనిస్టులు ఏమన్న తక్కువతిన్నర? మల్ల గవే కులాలు గదా? బిజెపి గదే గదా? కనుక ఉమ్మడి రాష్ట్రంలో సామాజిక న్యాయానికి అవకాశం లేదు. ఎందుకు లేదంటె... ఏవైతె రెండు బలమైన వర్గాలున్నయో, రెడ్డి అండ్ కమ్మ వాల్ల చేతుల్నుంచి బయటికి రాదు.

          తెలంగాణ, రాయలసీమ రెడ్లు గలిస్తే పెద్ద ఫర్మిడబుల్ ఫోర్స్ అది. కమ్మాస్ ఎమర్జ్ అయిపోయిండ్రు. విడిపోతే  ఏమైద్ది అంటె, ముందు కమ్మ ఫ్యాక్టర్ పోతది. తెలంగాణలో కమ్మ ఫ్యాక్టర్ వుండదు. అంటె బలమైన ఫ్యాక్టర్ గాదది. తెలంగాణ, రాయలసీమ రెడ్లు కలవకపోతె  తెలంగాణ రెడ్లు వీక్. వాల్ల ధనబలంతోని వీల్లు, రాజశేఖరరెడ్లు, విజయభాస్కరరెడ్లు జేయబట్టి వీల్లు.. పోతె... రాయలసీమ రెడ్లకన్న తెలంగాణ రెడ్లల్లో కొంత అవగాహన వచ్చింది. మనంతట మనం! రెండవది... ఇప్పటికి గూడ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం లోపల పదిరికుప్పంలు, వేంపెంటలు, కారంచేడులు జరుగుతున్నయ్. తెలంగాణలో గావు, అవకాశం లేదు. ఎందుకు జెప్తున్న అంటె ఇక్కడ బలహీన వర్గాలలో చైతన్యస్థాయి పెరిగింది. పెరగడం ఒక్కరోజులో గాదు, ఈ 50, 60 ఏండ్ల ఉద్యమాలు. రేపు రాష్ట్రం వచ్చినంక కూడా రాష్ట్రాన్ని కాపాడేది ఆ చైతన్యమె, వ్యక్తులు గాదు.


          సామాజిక న్యాయం అన్నప్పుడు... నేను అంతా న్యారో గా జూడను. బడుగు, బలహీనవర్గాలు, ఇపుడు తెలంగాణలో ఎందుకు సాధ్యమైతది అంటె, ఈ నేపధ్యం జరిగినపుడె, స్టేట్ యొక్క ధ్యేయమది అయినప్పుడె ఇవన్ని అయితయ్. ఆ ఎకనామిక్ డెవలప్మెంట్ పాలసీస్ ఎట్ల వస్తయయ్య? జనానికి ఇపుడు జయశంకర్ జెప్తెనో, నువ్వు జెప్తెనో రాదు గద. జనంలో చైతన్యం రావలె గద. ఆ చైతన్యం వచ్చింది.

కామెంట్‌లు లేవు: