యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

21, జూన్ 2013, శుక్రవారం

తెలంగాణ ఆత్మగౌరవం పై దాడిని త్రిప్పి కొడదాం - అందరం ఒక్కటైదం 1

             తెలంగాణ ఆత్మగౌరవం పై దాడి తారా స్థాయిలో ఉంది. దానిలో ప్రధాన పాత్ర ఆంధ్ర ప్రింట్ మీడియా, ఎలెక్ట్రానిక్ మీడియా
                     తెలంగాణ మనిషి నాయకత్వంలో ఉన్న ఒక రాజకీయ పార్టీని ముట్టడించిండ్రు.తగలపెట్టడానికి తెగబడ్డారు. “వసూళ్ల పార్టీ” అని తెలంగాణని  మోసం చేస్తున్నారు.
        మోసం వాళ్ళది. ఆర్ధిక ఉన్మాధులు వారు. మానవ విలవలు లేని సంస్కృతికి ప్రతినిధులు వారు. వసూళ్లు దాటి దోపిడీకి తెగపడ్డది వాళ్ళు. సూట్-కేస్ల సంస్కృతి వారిది.
               అన్ని పార్టీలు నడిచినట్లే తెలంగాణా పార్టి నడుస్తున్నది .తెలంగాణా పార్టీని “వసూళ్ల పార్టీ”అంటే తెలంగాన సమాజాన్నిఅవమానించినట్టే. ఆ మాట అన్న సీమాంధ్ర పీడకుల వెంట ఉన్నవాళ్ళు ముమ్మాటికి తెలంగాణ ద్రోహులే.
        సీమాంధ్ర ఆదిపత్య వర్గాల  వాలకం  ఆంధ్రోడు చేస్తే గొప్ప , తెలంగాణోడు చేస్తే తప్పు అన్నట్లు ఉన్నది. చక్రవర్తి చేస్తే శృంగారం, సామాన్యుడు చేస్తే వ్యభిచారం అన్నట్లు అహంకారతో , మోసపూరితంగా కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నరు.   
   తెలంగాణ నాయకత్వం పై జరుగుతున్నవిషప్రచారాన్ని తిప్పికొదడం. విశాల దృక్పతంతో ముందుకు పోదాం.తెలంగాణ మొత్తం ఒక్కటైదం.

       

ప్రొ.కె.జయశంకర్గారి మాటలు “వోడవని ముచ్చట్లునుండి

స్వభావరీత్యా చాలా లిబరల్ మనిషి

ఉదారంగ హెల్ప్ జేస్తడు, హెల్పింగ్ నేచర్. ఇపుడు పోలిటికల్ పార్టీకి ఫండ్ రెయిజింగ్, అందులో వింతేముంది? ఎవడైన జేయాల్సి వస్తది. కని ఖర్చు బెడతడు. పోలిటికల్గ రెయిజ్ జేసి పొలిటికల్గనే ఖర్చుబెడతడు ఆయన. ఫండ్ కలెక్షన్ లేకుండ ఇపుడు ఎట్ల నడుస్తదయ్యా పార్టీ? పార్టీలో మల్ల గదే సరుకు గదనయ్యా. కింది నుంచి పైకి పోయి వచ్చేవరకు మధ్యలో పోతనే వుంటది. టిఆర్ఎస్ ది పోలిటికల్ సంస్కృతి, అది ఏం జేయలేం. డోనర్ దగ్గర నుంచి నాకొచ్చే వరకు మధ్యలో కొంత పోతది, నాదగ్గరి నుంచి కిందికి బోయే వరకు మల్ల మధ్యలో పోతది, దాన్ని ఏం జేయలేం అంటడు ఆయన. సిస్టమ్ అది.
         స్వభావరీత్యా చాలా లిబరల్ మనిషి. చాలా లిబరల్ మనిషి ఆయన! ఆ విషయమనే గాదు, మందికి హెల్ప్ జేస్తుంటడు గదా ఆశ్చర్యమేస్తది. ఒకసారి ఒక పిల్లవానికి ఏదో మెడికల్ కేస్ వచ్చింది. బ్రెయిన్ ట్యూమరో ఏదో. పన్నెండు లక్షల ఖర్చు. ఆరోగ్యశ్రీ కింద లక్షే ఇస్తరు.వాల్లు ఏడ్చుకుంట వచ్చిండ్రు. ఐదు నిమిషాలు ఆగిండు. నేను ఏర్పాటు జేస్త అన్నడు. ఆయనకు తెలిసిన పది మందికి ఫోన్లు జేసిండు, పన్నెండు లక్షలు వచ్చినయ్! చెప్తున్న, నేను విట్నెస్. చివరకు పిల్లవాడు బతకలేదు, అది వేరు విషయం. ఒక్కరోజులో పన్నెండు లక్షలు కలెక్ట్ జేసి ఇచ్చిండు అంటే బీద పిల్లవానికి. స్వభావం. వ్యక్తిగతంగ సంపన్నుడు, ఆయనకి పెద్ద అవసరం లేనివి. కని పోలిటికల్గ అది సహజం. ఇపుడు ఇంత పెద్ద ఉద్యమాన్ని నడిపించడం అంటే ఎన్ని సోర్సెస్ నుంచి రావల్నయ్యా డబ్బు? ఎక్కడెక్కడి నుంచి రావాలె?






వాడు అయ్యను అడ్డం పెట్టుకొని బాగ సంపాదించే, ఇప్పుడున్నోడు కూడా వసూళ్లు చెస్తున్నాడు. డిల్లి కి పంపుతున్నాడు. మనం వెనకబడుతున్నాం. అయినప్పటికి ముందుకు పోవాలి, తెలంగాణాను ఆపాలి 













ముందుంది మంచి కాలం.నావెంటఉంటె సూట్-కేస్ల కొదవలేదు. డిల్లీకి పంపిస్తున్న. తెలంగాణాదొంగలకు ఇస్తున్న. గగన్  బాబుకు ఇస్తున్న. మీకిస్త. సుందిరమ్మ రాజ్యం అయిన మనదే. గజన్న రాజ్యం అయిన మనదే. తెలంగాణాను తొక్కుడే నాధ్యేయం.








సూట్-కేస్లకు కొదవ లేదు. సరిపోను నాదగ్గర ఉన్నాయి గోడౌన్లలో – ఇంకా వసున్నాయి. గజన్న రాజ్యమొస్తే నియోజకవర్గానికి ఒక సూట్-కేస్ల గోడౌన్ మీకు ఏర్పాటైతది. కాని మనం తెలంగాణని తొక్కాలి సూట్-కేస్లకొరకు 


     









 













22, మార్చి 2010, సోమవారం

WORLD WATER DAY - భూగోళం మీద మనిషికి అందుబాటులొ ఎంత నీరున్నది?

భూమండలం లొ మొత్తం 100 లీటర్ల నీరున్నదనుకుంటె
అందులొ 97 లీటర్లు సముద్రాలలొ ఉన్నవి - ఉప్పు నీరు, 3 లీటర్లు మాత్రమె మంచినీరు భూమిపై, భూగర్భంలొ ఉన్నవి.
ఆ 3 లీటర్ల మంచినీరులొ 2.25 లీటర్లు మంచుగడ్డల రూపంలొ ఉన్నవి. 0.70లీటర్లు(ఇందులొ సగం కంటె తక్కువ మనిషికి అందుబాటులొ ఉన్నవి) భూగర్బంలొ ఉన్నవి. 0.05 లీటర్లు సరస్సులలో, నదులలో ఉన్నవి.
అంటె 100 లీటర్లలొ మనిషికి అందుబాటులో ఉన్నది 0.70/2 + 0.05 =0.40 లీటర్ల లోపు (400 మిలీ లోపు)
400 మిలీ కూడా మనిషి చేతికి అందె దూరం లొ లేవు.
క్రింది లింకులొ చూడండి నీటి లభ్యత

నీరు

పద్ధతులు ఇలాగె కొనసాగితె పరిస్థితి 2070 లో ఏవిధంగా ఉండవచ్చొ డా.అబ్దుల్ కలాం గారి ఈ క్రింది link లో చూడండి.
year2070

22, March - WORLD WATER DAY - డా.అబ్దుల్ కలాం గారి హెచ్చరికను మననం చేసుకుందాం

Today World Water Day
పద్ధతులు ఇలాగె కొనసాగితె పరిస్థితి 2070 లో ఏవిధంగా ఉండవచ్చొ డా.అబ్దుల్ కలాం గారి ఈ క్రింది ప్రెసంటేషన్ లో చూడండి.
year2070

13, మార్చి 2010, శనివారం

తెలంగాణా - అభివృద్ధి గణాంకాలు - శ్రీకృష్ణ కమిటి పరిమితులు

ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితులను అధ్యయనం చేయడానికి శ్రీక్రిష్ణ కమిటీ పని ప్రారంభించింది.

ఇప్పటివరకు ఒక కమిటిని కాని, ఒక కమీషన్ని కాని ఏదైన ఒక సంఘటన పైన కాని, ఏదైన ఒక నిర్ధిష్ట విషయయం పై కాని వేస్తూ వస్తున్నారు. పరిమితమైన విషయాలపై తేల్చటానికె ఏండ్లకుఏండ్లు పడుతున్నది. కాని ఇప్పుడు ఈ కమిటికి అప్పగించిన పని ఒక హిమాలయమంత పర్వతాన్ని తవ్వమన్నట్లు ఉన్నది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉండవచ్చు కమిటి పని మరియు నివేదిక.

ఈ కమిటిని 2.75 లక్షల చ.కి.మీ. వైశాల్యం కలిగిన, దాదాపు 8 కోట్ల జనాభా కలిగి, భయంకరమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక అంతరాలున్న, కనీస నైతిక విలువలులేని రాజకీయ పక్షాలు కలిగిన ఒక దేశమంతటి స్థాయి గల రాష్ట్రాన్ని 2000 సంవత్సరాల చరిత్ర చూసి, 57 ఏండ్ల లొ పెట్టిన ఖర్చు, అభివృద్ధి లెక్కలు చూసి, అన్ని వర్గాలను సంప్రదించి ఏమి చేయాలో తేల్చమంటున్నారు.


ప్రభుత్వం వద్ద కదలని, పెరగని, తగ్గని భూమి యొక్క యాజమాన్య డాక్యుమెంట్లే లేవు. నెలనెల జీతాలు తీసుకొనె ఉద్యోగుల వివరాలు, లెక్కలు సరిగా లేవు. ఇక గణాంకాలు. Lies, damned lies, gov’t statistics. 57 ఏండ్ల నిధుల ఖర్చు, అభివృద్ధి గణాంకాలు ఉండే అవకాశం లేదు. లెక్కలు ఇవ్వవలసి వస్తే సీమాంధ్ర ప్రభుత్వం (తెలంగాణను సీమాంధ్రులు ఆక్రమించారు) వారికి అనుకూలముగా తయారు చేసి ఇస్తారు. ఎందుకంటె ఇచ్చిన తప్పుడు లెక్కలకును సరిచూసే అవకాశం లేదు.

ఒకవేళ నిజమైన లెక్కలు దొరికిన కేవలం ప్రాంతాలవారిగా చేసిన ఖర్చు ప్రాతిపదికన తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించడ వీలు కాదు. ప్రాంతాల వారి పెట్టిన ఖర్చు, జరిగిన అభివృద్ధి చూడాలంటున్నారు. ఇది సరియైన విధానం కాదు. ఎందుకంటె అభివృద్ధి అనేది మనుషులకు సంబంధించినది. సీమాంధ్ర ప్రాతం మరియు సీమాంధ్రులు అభివృద్ధి చెందినారనేది తెలంగాణవాదుల వాదన. ప్రాంతాలవారిగా, ప్రాంతములవారివారిగా జరిగిన ఖర్చు, అభివృద్ధి చూడవలసి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలొ దాదాపు 40 - 50 లక్షల (హైద్రాబాదులొనె 30-40 లక్షలు) సీమాంధ్రులు స్థిరపడినారు. అంటె దాదాపు 10 % పైగా జనాభా సీమాంధ్రులు. దాదాపు వీరంతా ఉన్నత మరియు ఎగువ మద్యతరగతి వారె. ఈ వలసవచ్చిన వారిలొ అత్యధికలను సాంకేతికంగా స్థానికులుగా గుర్తించుతారు.ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలొ అభివృద్ధి చెందిన వారిలో వీరుంటారు. వీరి అభివృద్ధి మిరుమిట్లుగొలిపె అభివృద్ధి. ఇది తెలంగాణ అభివృద్ధిగా చూపెడుతారు. వీరంతా ఇక్కడ స్థిరపడటానికి కారణాలను చూడలేరు. సాంకేతికంగా చూస్తె చంద్రబాబు, రోశయ్య, చిరంజీవి, జె.సి.దివాకర్ రెడ్డి, సత్యం రామలింగరాజు _ _ _ _ _ _ _ వీళ్లంతా తెలంగాణావాళ్లె. వీరి అభివృద్ధి అంతా తెలంగాణ అభివృద్ధియే. తెలంగాణలోని వ్యాపారాలు, పరిశ్రమలు 90% పైగా సీమాంధ్రులవేనన్న సంగతి అందరికి తెలుసు. కాని ప్రభుత్వ దృష్టిలొ, ఈ కమీటి దృష్టిలొ ఈ అభివృద్ధి అంతా తెలంగాణా అభివృద్ధియే. చివరకు సినిమా పరిశ్రమ అభివృద్ధి కూడా తెలంగాణ అభివృద్ధి క్రిందె లెక్క. ఈ విధంగా అభివృద్ధిని అంచనా వేయడం చేస్తే తెలంగాణా ప్రజలకు న్యాయమెలా జరుగుతుంది. నిజానికి అభివృద్ధి అయినది సీమాంధ్రులు, సీమాంధ్రలోని ప్రాంతాలు, సీమాంధ్రుల వలస ప్రాంతాలు(హైద్రాబాదు, ఆయకట్టు ప్రాంతాలు) మాత్రమె.

తెలంగాణవాదుల దృష్టిలో 1953 నుండి తెలంగాణకు వలసవచ్చిన వారంతా స్థానికేతరులే. ఈ స్థిరపడిన సీమాంధ్రులు కూడా ఇప్పటికి తెలంగాణవాసులిగా వారే పరిగణించుకోవడం లేదు. దీనిని కమీటి పరిగణలోకి తీసుకుంటుందా? దీనిని పరిగణలోకి తీసుకోకుండ తెలంగాణకు అన్యాయం జరిగినట్లు తేల్చగలరా?

చరిత్రలో చారిత్రకావసరంగా నిరంతరంగా సరిహద్దులు మారుతూనేవుంటాయి. ఇది రాజకీయ ప్రక్రియ . We, people of AP, have not started at starting. Also, we are not going to end at the ending. ఇప్పుడు తెలంగాణా ఏర్పాటు చారిత్రకావసరం. భవిష్యత్తులొ సమైక్యాంధ్రా అవసరం కావచ్చు. దీనిని కమిటి తేల్చగలదా?

తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను రాజకీయ పార్టీలు రాజకీయ ప్రక్రియ ద్వారా నెరవేర్చాలి. లేనట్లైతె అశాంతి, హింస అనివార్యం . దానికి ఎవరు భాద్యులు?

27, ఫిబ్రవరి 2010, శనివారం

తెలంగాణా - అందుకోలేని అభివృద్ధి

ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపి, టిడిపి లకు ఆర్ధిక విధానాలలో మౌలికమైన తేడాలేమిలేవు. 1947 నుండి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి క్రమానికి అవి ఇచ్చె వివరణ దాదాపు ఒక్కటె. మంచి, చెడుల జోలికి వెళ్లకుండ, అంకెల జోలికి వెళ్లకుండ క్లుప్తంగా చెప్పితె ఆ పరిణామ క్రింద చెప్పిన విధంగా వుంటుంది.

ఎంత తక్కువ శాతం జనాభా వ్యవసాయం చేస్తె దేశం అంత అభివృద్ధి చెందినదిగా అర్దికవేత్తలు, దేశాధినేతలు గుర్తిస్తున్నారు. అంటె జనాభాను వ్యవసేతర రంగాలకు మరలించాలి. (వ్యవసాయం అంటె కుల వృత్తులను కలుపుకొని)

భారత దేశం జనాభా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడుతుంది. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ జనాభా కూడా వ్యవసాయం మీదే ఆధారపడుతుంది. అందులో తెలంగాణ ప్రాంత జనాభా ఇంకా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడుతుంది.

స్వతంత్రం వచ్చిన తరువాత ఈ అభివృద్ధి క్రమం ఎలా జరిగింది?

స్వతంత్రం వచ్చేనాటికి జనాభా చాలా ఎక్కువగా వ్యవసాయం మీద అధారపడుతుండేది. అభివృద్ధి జరగాలి అంటె వ్యవసాయం చేసే జనాభా తగ్గాలి. జనాభా ఇతర (పారిశ్రామిక, సేవ) రంగాలకు మరలాలి. ఇదే సమయం లో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గవద్దు. అంటె వ్యసాయ ఉత్పాదకత పెరగాలి. దీనికి నీటిపారుదల ప్రాజెక్టులు కట్టాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అమలు చెయ్యాలి. పారిశ్రామిక, సేవా రంగాల అభివృఇద్ధి జరగాలి అంటె అవసరమైన మానవవనరులు కావాలి. అంటె విద్యా, వైద్యావకాశాలు కల్పించాలి. ఇవన్ని చేయాలంటె పెట్టుబడులు కావాలి. కాని ప్రజల వద్ద పెట్టుబడులు లేవు. కావున వ్యవసాయ, విద్య, వైద్య, పారిశ్రామిక, సేవా రంగాలలో ప్రభుత్వం మాత్రమే అధికంగా పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేస్తూ వచ్చింది. అదే సమయం లొ అట్టడుగు వర్గాల కొరకు సంక్షేమ పథకాలు అమలు చేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెరగడం వలన, మానవ వనరుల అభివృద్ధి (ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉపాధి అవకాశాలు) వలన జనాభా క్రమంగా ఇతర రంగాలకు తరలుతూ వచ్చినది. ఈ క్రమంలోనె ప్రజల వద్ద కొంత పెట్టుబడులు పోగై, పెట్టుబడులు పెట్టే స్థాయికి వచ్చినారు. ఇది 1947 నుండి 1990 వరకు జరిగినది. అప్పుడే సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలు మొదలు పెట్టినారు. క్రమంగా ప్రభుత్వం అన్ని రంగాలలొ పెట్టుబడులు తగ్గిస్తు, ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తు వస్తున్నది.

అంటె ప్రభుత్వం వ్యవసాయానికి, విద్యకు, వైద్యానికి, ఉపాధికి ఇచ్చిన తోడ్పాటు వలన ప్రజలు అన్ని

రంగాలలో అభివృద్ధి చెందినారు.

అంటె మౌలికమైన విద్య, వైద్య చివరకు వ్యవసాయం తొ సహ అన్ని రంగాలకు అవసరమగు పెట్టుబడులు, మానవవనరులు సమాజానికి వనగూరినాయి. అంటె సర్వస్వతంత్రం అవుతున్నది. అంటె ప్రజలకు దాదాపు సమాన అవకాశాలు వచ్చినాయి.

ప్రభుత్వం – పెట్టుబడులు

వ్యవసాయం

విద్య

వైద్యం

పారిశ్రామీకరణ
సమాజం - పెట్టుబడులు

వ్యవసాయం
సమాజం - పెట్టుబడులు
విద్య
సమాజం - పెట్టుబడులు
వైద్యం
సమాజం - పెట్టుబడులు
పారిశ్రామీకరణ
సమాజం - పెట్టుబడులు
వ్యవసాయం
---------------
---------------


ఒక వలయం ఏర్పడినది ప్రభుత్వం లేకుండ

ఇప్పుడు డబ్బు ఉంటె ఏ చదువైన చదువవచ్చు. పెట్టుబడి ఉంటె ఏ వ్యాపారమైన, పరిశ్రమైన, సెజ్ అయిన పెట్టుకోవచ్చు. ఇక్కడ కుల, ప్రాంత బేధాలు లేవు. ప్రభుత్వ పాత్ర ఒక సంధానకర్త గానె ఉంటుంది. ప్రకృతి వనరులను కేటాయిస్తుంది.

ఇప్పుడు డబ్బు ఉంటె ఏ చదువైన చదువవచ్చు. పెట్టుబడి ఉంటె ఏ వ్యాపారమైన, పరిశ్రమైన, సెజ్ అయిన పెట్టుకోవచ్చు. ఇక్కడ కుల, ప్రాంత బేధాలు లేవు. ప్రభుత్వ పాత్ర ఒక సంధానకర్త గానె ఉంటుంది.

అంటె ఇప్పుడు ప్రాంతీయ వివక్ష, ఏర్పాటు వాదాలు కాలం చెల్లిన విషయాలు.

తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అర్థం లేనిది.

అందరం పోటిబడవలసినదె.

తెలంగాణ, సీమాంధ్ర తేడా లేదు. పోటి బడాలి.

అవకాశాలు ఉన్నాయి. కాని అందనివి. అందుకోలేనివి.

కాని 1947-2010 మద్య తెలంగాణ ప్రాంతానికి అందవలసిన ప్రభుత్వ తోడ్పాటును సీమాంధ్రులు అందుకున్నారు. తెలంగాణా వనరులను ఆక్రమించినారు. విద్యావకాశాలు లేవు. వ్యవసాయానికి నీళ్ళు లేవు. ఉద్యోగాలు లేవు.
1947-2010 మద్య తెలంగాణా కు ప్రభుత్వం లేదు. ప్రభుత్వ సహాయం లేదు.
పెట్టుబడులు లేవు.
అవసరమైన మానవవనరులు లేవు.
దాదాపు మనం ఇంకా 1950 లోనే ఆగిపోయాము.

సీమాంధ్రులతో పోటిపడ లేము.

అందుకే మనకు 1947-90 విధానాలు కావాలి.

అందుకె తెలంగాణ కావాలి.

20, ఫిబ్రవరి 2010, శనివారం

తెలంగాణ ఆకాంక్ష - సీమాంధ్ర ప్రభుత్వ అణచివేత - అపహాస్యం - ఆత్మబలిదానాలు

ప్రపంచ చరిత్రలో ఒక ప్రాంత లేదా ఒక జాతి ప్రజలు తెలంగాణ ప్రజలలాగ బలమైన ఆత్మగౌరవ, స్వపరిపాలన ఆకాంక్షను శాంతియుతంగా ప్రజాస్వామికంగా వెలిబుచ్చిన సంధర్భం లేకపోవచ్చు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా అన్ని విభేధాలను ప్రక్కకు పెట్టి ఒకే వేదిక మీదికి వచ్చిన ఒక మహత్తరమైన సంధర్భం. వీటికి కొలమానాలు, రికార్డుల లాంటివి ఉంటె ఖచ్చితంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కవలసిన సంఘటన.

ఇక్కడ కూడా అన్ని ప్రజస్వామిక ఆకాంక్షలకు ఉండేవిధంగా అణిచివేత ఉన్నది. ఈ సీమాంధ్ర ప్రభుత్వ అణచివేతదారులకు ప్రపంచంలో ఎక్కడాలేని అనుకూలతలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు తమ ఆకాంక్షను వెలిబుచ్చటానికి చాలా ప్రతికూలతలు, పరిమితులు ఉన్నాయి. పలితంగా అణచివేత చాలా బహుముఖంగా, కౄరంగా ఉన్నది. తెలంగాణ ప్రజల పరిస్థితి చాలా దమనీయంగా ఉన్నది.
సీమాంధ్రులకు ప్రభుత్వానికి దానిని సమర్ధించుకోవటానికి ఉన్న అనుకూలతలు - ఆ సమర్ధనల అసంబద్ధతలు:
1.ఈ ప్రభుత్వం తెలంగాణతో కూడుకొని ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంగా చెప్పబడుతున్నది. ఈ ప్రభుత్వం లో తెలంగాణ ప్రాంత ప్రతినిధులు ఉన్నారని, హోం మంత్రి గా కూడా తెలంగాణ ప్రాంత ప్రతినిధి ఉన్నారని చెప్పుతున్నారు.
ఈ ప్రభుత్వం పై స్థాయిలో కీలకమైన స్థానాలలో ఎవరున్నారో చూడండి.
ముఖ్యమంత్రి: రోషయ్య - సీమాంధ్రుడు
శాసన సభ స్పీకర్ - కిరణ్ కుమార్ రెడ్డి - సీమాంధ్రుడు
శాసన సభ డిప్యూటి స్పీకర్ - నాదెండ్ల మనోహర్ - సీమాంధ్రుడు
శాసన మండలి చైర్మన్ - చక్రపాణి - సీమాంధ్రుడు
శాసన మండలి వైస్-చైర్మన్ - మహ్మద్ జాని - సీమాంధ్రుడు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - ఎస్వి ప్రసాద్ - సీమాంధ్రుడు
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిస్ (డిజిపి) - గిరీష్ కుమార్ - సీమాంధ్రుడు
హైద్రాబాద్ నగర పోలిస్ కమీషనర్ - ఎ.కె.ఖాన్ - సీమాంధ్రుడు
ఇవన్ని యాదృచ్చికమా? 40% జనాభా ఉన్న తెలంగాణా వారి స్థానమెక్కడో దీనిని చూస్తె తెలుస్తుంది. ఇక ఉన్న హోం మంత్రి గారి అధికారమెంతో ఎంత తక్కువ చెప్పితె అంత మంచిది. ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్న ఆమెగారు పదవిలో ఇంకా కొనసాగకపోయేవారు.
2.రాష్ట్ర రాజధాని కూడా తెలంగాణ ప్రాంతం లోనె ఉన్నది. పెట్టుబడులు మొత్తం ఈ రాజధానిలోనె పెడుతున్నారు. రాజధానిలో చాలా అభివృద్ధి జరుగుతున్నది. కావున తెలంగాణ అభివృద్ధి జరగటం లేదనటం నిరాధారం అంటున్నారు.
అసలు వారు తెలంగాణాను కలుపుకొనుటకు రాజధాని హైద్రాబాద్ ఒక ముఖ్య కారణం. ఇప్పుడు హైద్రాబాద్ లో 30 నుండి 40 లక్షల సీమంధ్రులు స్థిరపడ్డారు. దురాక్రమణ జరిగినది. గత 53 ఏండ్లనుండి దోచుకున్న ప్రభుత్వ ఉద్యోగాలు, సాగునీటి వనరులు, ఇతర అనేక రకాల వనరులతో పెట్టుబడులు కూడబెట్టుకున్నారు. ఆ పెట్టుబడులతో హైద్రాబాద్ లో స్వంత ఆస్థులను అభివృద్ధి చేసుకున్నారు. కొంతమంది బడా పెట్టుబడుదారులు గేటెడ్ కమ్యూనిటిలు(బంజార, జూబ్లి హిల్స్ లాంటి), వాటిలో రాజభవనాలు కట్టుకొని ప్రపంచంలోనె అత్యంత ఆడంబరంగా బ్రతులను అనుభవిస్తున్నారు. వారికి అండగా సీమాంధ్ర మద్యతరగతి కూడా హైద్రాబాద్ లో బలంగా ఉన్నది. తెలంగాణ ప్రజలకు హైద్రాబాద్ లో ఉన్న ఆస్తులు నామమాత్రం. ఆస్తులు, అభివృద్ధి మొత్తం సీమాంధ్రులది.
3.రాష్ట్ర ప్రజలు అంతా ఒకే భాష మాట్లాడుతున్నారని, చారిత్రకంగా చూసిన ఒక బ్రిటిష్ వారి కాలంలొ 150 లేదా 200 ఏండ్లు తప్ప ఎప్పుడు కలిసే ఉన్నామని అంటున్నారు.
చరిత్ర నడుస్తూ వుంటుంది. ఇప్పుడున్న భౌగోలిక ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు ఎప్పుడు లేదు. మేజారిటి తెలుగు ప్రజలతో, ఇతర భాషల ప్రజలతో కలిసి అప్పుడప్పుడు సర్వ స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి. కాని, ఇప్పుడున్న తెలుగు ప్రజల రాజ్యం స్వతంత్ర రాజ్యం కాదు. భారత దేశానికి, దాని రాజ్యాంగానికి లోబడి ఉన్న ఒక సామాంత రాజ్యాం మాత్రమే. అంటె ఫెడరల్ స్వభావమున్న దేశంలో అంతర్భాగం. కాబట్టి, తెలంగాణ ఏర్పాటుకు చారిత్రిక కారణాలు అడ్డు చూపడం అసంబద్ధం. తెలంగాణ ఏర్పాటు అనేది చరిత్ర గమనంలో కొంత కాలపరిమితిగల ఇప్పటి తరాల ఏర్పాటుగానె చూడాలి. రాబోయే తరాలు కలిసి ఉండాలి అనుకుంటె మల్లీ సమైక్యాంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసుకోవచ్చు.
4.రాష్ట్రం లో మెజారిటి ప్రజలు కలిసి ఉండాలని కోరుకుంటున్నారని చెప్పుతున్నారు.
దాదాపు 40% జనాభాతో తెలంగాణవారు ఆంధ్రప్రదేశ్ అనబడె ఒక అసంబద్ధ రాష్ట్రం లో అన్యాయమైన ఒడబండికతో ఒక మైనారిటి హోదాను పొందినారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలంగాణ ప్రజల నుండి తెలుసుకోవాలి. సీమాంధ్రుల ఆకాంక్షలతో సంబంధం లేదు.
5.తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష లేదనటానికి ఒక పార్టి ఎన్నిక్లలో ఓడిపోవడాన్ని చూపెడుతున్నారు.
ఓట్లకు, సీట్లకు ప్రజల ఆకాంక్షలకు సంబంధం లేదు. ఎందుకొంటె తెలంగాణా ఆకాంక్షకు అన్ని పార్టీలు వ్యతిరేకం కాదని ప్రచారం చేసుకున్నాయి. ఇప్పుడు ఏ పార్టి అయిన సమైక్యాంధ్ర నినాధంతో పోటి చేసి తెలంగాణాలో గెలవమని చెప్పమనండి.
6.ఏదైన వెనకబాటు తెలంగాణలొ ఉంటె దానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు భాద్యులంటున్నారు. అంటె వారిని ఎన్నుకున్న ప్రజలే కారణమని చెప్పక చెప్పుతున్నారు.
ఇది వారి ధాష్ఠికానికి పరాకాష్ట. వారు మేజారిటి. వారు తెలంగాణ కంటె ఒక తరం ముందున్నారు. తెలంగాణ రాజకీయ వైపల్యం వలననె తెలంగాణ వివక్షకు గురైనది. తెలంగాణ నాయకులు, సీమాంధ్ర నాయకుల ఆధిపత్యాన్ని అడ్డుకోలేరు. నాయకులను పక్కకు పెట్టి ఇప్పుడు ప్రజలు ముందుకు వచ్చినారు.
ఇలా చెప్పుకుంటూ పోతే సీమంద్రులకు చాలాఅసంబద్ధ అనుకూలతలు ఉన్నాయి.
తెలంగాణ ప్రజలకున్న పరిమితులు:
1 తెలంగాణ ప్రాంతంలో సామాజిక, ఆర్ధిక కారణాలవల్ల నక్షలైట్ ఉద్యమం గత 7,8 ఏండ్ల క్రితం వరకు బలంగా ఉన్నది. చంద్రబాబు, రాజశెఖర రెడ్డిల హయాం లొ ఉక్కు పాదం తొ ఉద్యమాన్ని అణచినారు. దీనిని ఆ ప్రభుత్వాలు గర్వంగా ప్రకటించుకున్నాయి. నిజం కూడా. కాని ఇప్పుడు ఈ తెలంగాణ ఆకాంక్ష వెనక నక్షలైట్స్ ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు తమ ఆకాంక్షను తెలిపే క్రమం లో, ప్రభుత్వానికి నిరసనను తెలిపే సమయం లోఉనికిలో లేని నక్సలైట్ల ముద్ర పడకుండా ఉండటానికి చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఉద్యమాలలో జరిగే సాధారణమైన నామమాత్ర హింస, విధ్వంసం కూడా జరగకుండా చూసుకొనవలిసి వస్తుంది. ప్రభుత్వం, సీమాంధ్రులు దీనిని ఉద్యమం బలహీంగా ఉందని చూపెట్టె ప్రయత్నం పరోక్షంగా చేస్తున్నారు. హింసకు దిగితే నక్షలైట్ల ముద్రవేసి ఉక్కు పాదం తో అణిచే ప్రయత్నం జరుగుతుంది.
2.పైన చెప్పిన ప్రతిబంధకం కారణంగా, ప్రజాస్వామికంగా ప్రజలను సమీకరించటానికి ప్రయత్నిస్తె, అసాంఘిక శక్తులు విధ్వంసానికి పాల్పడుతాయని సీమాంధ్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తున్నది. దీనిని ప్రతిఘతించి కూడా శాంతియుతంగా చేసే నిరసనలను కూడా ప్రభుత్వం బలాన్ని ఉపయోగించి అడ్డుకుంటున్నారు. దీనికి ఉదాహరణ 20.02.2010 నాటి విద్యార్ధుల అసెంబ్లి ముట్టడిని అడ్డుకున్న పద్ధతి. అసాధారణ రీతిలో ఇరువై వేల మంది పోలిసులను ఉపయోగించి విద్యార్ధులను అడ్డుకున్నరు. ఇరువై వేల మంది పోలీసులు కాక జిల్లాలలో పోలిసులు జిల్లా స్థాయిలలోనె విద్యార్దులను అడ్డుకున్నారు. రైల్వే ట్రాకుల పై బాంబుల బూచి చూపెట్టి విద్యార్ధులు రాకుండ రైళ్లను ఆపినారు. ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి కానరాకుండా ఇంత దుర్నీతితొ, పాశవికంగా అడ్డుకోవడం కనీవిని ఎరుగనిది.
3.తెలంగాణ రాజకీయ నాయకత్వం మొత్తం సీమాంధ్ర నాయకత్వం చెప్పినట్లు బూటక ఉద్యమాలు చేసి, ప్రజలను గంధరగోళ పరచడం.
ఇంతటి ప్రతికూల పరిస్థితులలో, తమ ఆకాంక్షను వెలిబుచ్చటానికి మిగిలిన ఏకైక అవాంచనీయ మార్గం ఆత్మ బలిదానాలు.
అత్మబలిదానాలు పర్యవసానంగా హింస ప్రజ్వరిళ్లుతె, పరిస్థితి విషమిస్తే సీమాంధ్ర పెట్టుబడుదారులను, నాయకులను అడ్డుకోలేని సీమాంధ్ర సామాన్య ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉన్నది.
కాబట్టి, సీమాంధ్ర ప్రజాసంఘాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి సీమాంధ్ర పెట్టుబడుదారులను, నాయకులను ఎదిరించాలి.

16, ఫిబ్రవరి 2010, మంగళవారం

సమైక్యాంధ్రుల అపోహలు - ఎన్.టి.ఆర్. - అంధ్రుల ఆత్మాభిమానం - సమైక్యత

విభజన అంటె విలవిలలాడె సీమాంధ్రులు ఎన్.టి.ఆర్. తెలుగు ప్రజల ఆత్మగౌరవం ప్రస్థావన తీసుక వస్తున్నారు. ఎన్.టి.ఆర్. చేసిన ఘనకార్యం(సంస్కరణలు) ఏమిటి?
ఆంధ్ర ప్రదేశ్ లో 1959 లో 330 సమితీల(బ్లాక్స్))ను ఏర్పాటు చేసినారు. వాటిని ముక్కలు చేసి 1091 మండలాలను 15,జనవరి,1987 నాడు ఏర్పాటు చేసినారు. దీనిని వికేంద్రీకరణ, ప్రజల వద్దకు పాలన అని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు.
ఇది విభజన కాదా? ఇది వేర్పాటు కాదా? ఇది ప్రజల మద్య చిచ్చు పెట్టడం కాదా? ఇది సమైక్యతా వాదమా?
ఇది ఎంత అసంబద్ధ, దుర్మార్గమైన , స్వార్ధపూరిత చర్య అంటె, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసి, దానిని అసౌష్టవంగా తయారు చేసినది. వికేంద్రీకరణ పేరుతో భయంకరమైన కేంద్రీకరణ జరిగినది. ఎమ్మెల్యేలను ఆధునిక జమిందార్లను చేసినది. వారినిరాజకీయంగా నియంత్రించే స్థానిక ప్రతినిధి లేకుండా చేసినది. ప్రతి దానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడేవిధంగా కేంద్రీకృత వ్యవస్థ తయారైనది. స్థానిక ప్రతినిధులను ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు చేతిక్రింది కార్యకర్తలుగా తయారు చేసినది.

అసలైన వికేంద్రీకరణ అంటె మనగలిగె చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, బలమైన పెద్ద స్థానిక సంస్థలను ఏర్పాటు చేయడం. అంటె ఆంధ్ర ప్రదేశ్ ను 2 లేదా 3 రాష్ట్రాలుగా విడగొట్టాలి. మండలాలను రద్దు చేసి, సమితిలను ఏర్పాటు చేసి శాసన సభ్యులకు, మంత్రులకు సమవుజ్జిలైన స్థానిక ప్రజా ప్రతినిధులను తయారు చేయడం. ఆరొగ్యకరమైన,సౌష్టవమైన అధికార కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

9, జనవరి 2010, శనివారం

రాజకీయేతర సమైక్యాంధ్రవాదుల అపోహలు - వివరణ

కొంతమంది 20- 30 ఏండ్ల యువకులకు కనీసం గత 53 ఏండ్లలో జరిగిన పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘన, ముల్కి నిబంధనల ఉల్లంఘన, 6 సూత్రాల ఉల్లంఘన, జి.ఒ.610 అమలు పరచక పొవడం గురించి తెలుసుకొనే, అలోచించే ఓపిక లేదు. ఈ యువకులంత గ్లొబలైజేషన్ యుగంలో ఈ వేర్పాటులేంటి అంటున్నారు. కొంతమంది తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు చూసిన పెద్దలు, బుద్ధిజీవులు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కొంతవరకు అంగీకరిస్తున్నారు. వీరుకూడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పూర్తిగా సమర్దించలేకపోతున్నారు.
వీరు లేవనెత్తుతున్న కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు:
ప్ర:తెలంగాణ ప్రజలలో తెలంగాణ వాదం ఉంటె టీఆరెస్ పార్టి ఎన్నికలలో ఎందుకు ఓడి పోయింది?
జ:టీఆరెస్ అధినేత కెసీఆర్ యొక్క వ్యక్తిగత బలహీనతలు అతని వాదానికి గుదిబండలుగా మారినాయి. అదే సమయంలో కొందరు సీమాంధ్రులు ఉద్యోగాలు, భూములు, అన్ని రకాల ప్రకృతి వనరులు దోచుకున్నట్లే ఈ తెలంగాణావాదాన్ని కూడా వారివారి పార్టీల ద్వారా కబ్జా చేయించినారు. 2004 సంవత్సరంలో కాంగ్రెస్ తెలంగాణాకు అనుకూలమని టీఆరెస్ తో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ ప్రజల ఓట్లు దోచుకున్నది. 2009 సంవత్సరంలో టిడిపి పార్టి తెలంగాణాకు అనుకూలమని టీఆరెస్ తో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ ప్రజల ఓట్లు దోచుకున్నది. ఈ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ కూడా తెలంగాణాకు అనుకూలమంటూనే రోశయ్య కమిటి అంటూ ఏదో ఒకటి వేసి తెలంగాణ ప్రజల ఓట్లు దోచుకున్నది. పీఆరిపి కూడా చేతనైన వరకు తెలంగాణ ప్రజల ఓట్లు దోచుకున్నది. ఈ రెండు ఎన్నికలో "సమైక్యాంధ్ర" వాదన ఉనిక్కే లేదు. ఇంతకు ముందు కూడా లేదు.
తెలంగాణా వాదాన్ని కూడా సీమాంధ్రా నాయకులు కబ్జా చేసి, మోసపూరితంగా టీఆరెస్ ను ఓడించి దానినె ఎప్పుడు ఉనికిలో లేని "సమైకాంధ్రావాదం" గెలుపు అంటున్నారు.
ఇప్పుడు ఈ సీమాంద్రా నాయకులు వారి తొత్తులైన తెలంగాణా కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను, ఎంపీలను రాజీనామా చేయించి మళ్లి పోటిచేసి గెలవమని చెప్పండి.

2004 సంవత్సరంలో గాని, 2009 సంవత్సరంలో గాని కాంగ్రెస్, టిడిపి పార్టీలు తెలంగాణాకు అనుకూలమన్న సీమాంధ్రాలో వారికి వ్యతిరేకత రాలేదు. దీనిని బట్టి సీమాంధ్ర సామన్య ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని తెలుస్తుంది. ఈ ఓట్లే ఈ విషయం చెప్పడం లేదు. ఈ పార్టీలు సీమాంధ్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమై వుంటె ఎన్నికలముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ముందుకు వచ్చేవాళ్లా?

సీమాంధ్ర రాజకీయనాయకులు, బడాపారిశ్రామికవెత్తలు మాత్రమే తెలంగాణాకు వ్యతిరేకమని ఇప్పుడైన అర్ధం కావడం లేదా?
ప్ర:హైద్రాబద్ లో తెలంగాణావాదం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి హైద్రాబాదుకు సంబంధం ఏమిటి?
జ:తెలంగాణా వాదం బలంగా వున్నదని, తెలంగాణాకు అన్యాయం జరిగిందని అంగీకరించె కొంతమంది, హైద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో టీఆరెస్ ఓడిపోతామని బయపడి పోటిచేయలేదని, హైద్రాబద్ లో తెలంగాణావాదం లేదని, కాబట్టి హైద్రాబాదును తెలంగాణానుంచి వేరు చేయాలని అంటున్నారు.
టీఆరెస్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో పోటి చేయకపోవడానికి ఇంతకుముందు చెప్పిన సమాధానమె చెప్పాలి.
సరె హైద్రాబాదులో పూర్తిగా సమైక్యాంధ్రావాదులే అధికంగా ఉన్నారనుకుంటె, ఈ అధికం అనేదానికి కారణమేంటి? మా ఉద్యోగాల కబ్జా, మా భూముల కబ్జా, మా వనరుల దురాక్రమణ పలితమే కాదా హైద్రాబాదు లో ప్రక్కనే ఉన్న మా వారికంటె సీమాంధ్రులు ఎక్కువగా స్థిరపడటానికి.
స్థిరబడటాన్ని మేము అంగీకరిస్తున్నాం. కాని హైద్రాబాద్ తెలంగాణాలో భాగం కాదనకూడదు. ఉద్యోగాలను,భూములను, అన్ని వనరులను దురాక్రమణ చేసి స్థిరపడిన సీమాంధ్రులు హైద్రాబాద్ లో భాగం కాదు. హైద్రాబాద్ నుంచి వారిని వేరు చేయాలి.
ప్ర: గ్లొబలైజెషన్ యుగం లో ఈ వేర్పాటు వాదమేమిటి?
జ: అసలు ఇది కనీస అవగాహన ఉన్నవారు కూడ అడగరు. కాని దురదృష్టం. కొంతమని సీమాంధ్ర యువకులకు అవగాహన లేదనుకుంట. లేకపోతె కొంతమంది సీమాంధ్ర పెద్దలకున్న ఆదిపత్య ధోరణైన అయిండవచ్చు. "స్థానికత" కు ప్రపంచం అంతట ఉనికి ఉన్నది. ఈ రోజు ఆస్ట్రేలియాలో ఏమి జరుగుతుంది? ఇంత అభివృద్ధి చెందినా చాలా యూరోపియన్ దేశాలలో విదేశి ఉద్యోగులకు భత్రత ఉన్నదా? ఆర్ధిక మాంధ్యం సందర్భం లో అమెరికాలో కూడ విదేశియలకు ఉద్యోగాలు తగ్గలేదా? అమెరికా ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ లో స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా ఆలోచించలేదా?

5, జనవరి 2010, మంగళవారం

జై తెలంగాణ సినిమా

జై తెలంగాణ
కథానాయకులు: తెలంగాణ జనం

దర్శకత్వం: తెలంగాణ విద్యార్ధులు

స్క్రీన్ ప్లే, కథ, మాటలు, పాటలు, సంగీతం: తెలంగాణ జనం

నిర్మాతలు: తెలంగాణ జనం

ముఖ్య ప్రతినాయకుడు: చంద్రబాబు నాయుడు

హాస్య ప్రతినాయకులు: చిరంజీవి, లగడపాటి, నన్నపనేని, నాగం

జిత్తులమారి ముసలి ప్రతినాయకుడు: రోశయ్య

సహాయ ప్రతినాయకులు: సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు

అసహాయ ప్రతినాయకులు:తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు

ప్రేక్షకులు: సీమాంధ్ర ప్రజలు


(పొగరుబోతు, మోసకారి సీమాంధ్ర దోపిడి దారులు మా "జై తెలంగాణ" సినిమాను దొంగిలించి దొంగ సినిమా తీస్తున్నారు.)

21, డిసెంబర్ 2009, సోమవారం

తెలంగానోద్యమం - సమైక్యాంధ్రోద్యమం - తేడా

తెలంగాణోద్యమం
ప్రజలలో నమ్మకాని కోలిపోయిన, రాజకీయంగా దిగజారిన, అనుచరులనందరిని దూరం చేసుకొన్న, వ్యక్తిగత బలహీనతలతో కునారిళ్లిన, ఎక్కడ చోటు లేని, అన్ని వైపులనుండి దాడులను ఎదుర్కొంటున్న ఒక విచిత్రమైన నాయకుడు, పేరు చెప్పితె చాలు ఆంధ్రా వాళ్ల ఘోరమైన జోకులకు గురయ్యే, ఆంధ్రావాళ్లు జోకరుగా చూసే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న సంధర్భం.
తెలంగాంఅ లొ ఉన్న 119 మంది ఎమ్మెల్యేలలో, 110 మంది ఎమ్మెల్యేలు తెలంగాణపై నోరు విప్పలేని పరిస్థితి, 16 మంది ఎంపీలలో 14 మంది ఎంపీలు నోరు విప్పలేని పరిస్థితి.వీరు నోరు విప్పకపోగా తమ అనుచరులను తెలంగాణ గురించి మాట్లాడనివ్వకుండా, ఉద్యమంలో పాల్గొనకుండా అడ్డుకుంటు, తమ అధిష్టానాల మాటకు కట్టుబడి ఉన్నారు. ఎమ్మేల్యేలలో, ఎంపీలలో కొందరు తెలంగాణ వ్యతిరేకులు (కారణాలు వదిలెయ్యండి) ఉన్నరు.
అయినప్పడికి ఉద్యమం ఎలా నడిచింది. నిమ్మరసం తాగిన బక్కనాయకుడిని మళ్లిదీక్షలోకి నెట్టింది.
ఆత్మార్పణలకు ఒడిగట్టింది. ప్రజలో ఉన్న ఆకాంక్ష ఒక్క సారిగా ఎగిసి పడింది. అన్ని వర్గాలు తమ ఆకాంక్షలను వెలిబుచ్చుచు, ఉద్యమంలో పాల్గొన్నాయి.
విద్యార్ధులు, ఉద్యోగులు,రచయతలు, కవులు, కళాకారులు, అన్నికులవృత్తుల వారు, వ్యాపారులు, విద్యాసంస్థలు, కార్మిక వర్గాలు, అయ్యప్ప స్వాములు, స్వాతంత్ర్యసమరయోధులు, రోజు ఉదయమే కలిసే మార్నిగ్ వాకర్స్________________ ఇలా అన్ని వర్గాలు స్వచ్చ్చందంగా పాల్గొన్నారు.
సమైక్యాంధ్రోద్యమం
డిశంబర్ 10 తారీఖు మధ్యరాత్రి ఎలుబడిన ప్రకటన కంటె ముందే, ఆంధ్రా, రాయలసీమ ప్రాంత నూటడెబ్బై అయుదు మంది ఎమ్మెల్యేల, కొంతమంది ఎంపిల రాజినామా వార్తలు ప్రజలకు చేరినాయి. ఇరువై ఆరు మంది ఎంపి.,నూటడెబ్బై అయుదు మంది ఎమ్మెల్యేల అనుచరలకు ఆందోళనలు చేయాలని ఆదేశాలు వెళ్లినాయి. నాయకులు ఆందోళనలు చేయడానికి అన్ని రకాల సహకారం అందిస్తూ రెచ్చగొడుతున్నారు. తెలంగాణ ప్రజలు వినూత్నంగా చేసిన ఉద్యమాన్ని అనుకరిస్తున్నారు.
ఇది ప్రజా ఉద్యమం కాదు. నాయకులు నడిపిస్తున్న వీధి నాటకాలు.

20, డిసెంబర్ 2009, ఆదివారం

సమైక్య తెలంగాణ - సమైక్య ఆంధ్ర

సమైక్య తెలంగాణ - సమైక్య ఆంధ్ర
ఆచరణ సాధ్యమా? నాకు అంతగా అవగాహన లేదు.
క్రింది రెండు ప్రతిపాదనలు పరిశీలించాలి.
1.తెలంగాణ 10 జిల్లాలను, ఉత్తరాంధ్ర 3 జిల్లాలలను కలిపి కళింగ తెలంగాణ ఏర్పాటు.(ఈ రెండు ప్రాంతాలకు ఉమ్మడి సరిహద్దు లేదు. కాని తూర్పు గోదావరిలోని ఒకటి, లేదా రెండు వెనకబడిన నియోజకవర్గాలను కలిపుకుంటె ఉమ్మడి సరిహద్దు ఏర్పడుతుంది.)
లేదా
2.తెలంగాణ 10 జిల్లాలను, రాయలసీమ 4 జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు
ఈ రెండు ప్రతిపాదనలలో కలిసివచ్చె అంశాలు
1.వెనకబడిన ప్రాంతాలు కలవడం
2.ప్రస్తుత శాసనసభలో తీర్మానానికి మెజారిటి పొందటం.

13, డిసెంబర్ 2009, ఆదివారం

తెలంగాణోద్యమం - సమైక్యాంధ్రోద్యమం - ఇప్పటి రాజకీయ కారణాలు

తెలంగాణ ఉద్యమానికి 50 ఏండ్ల చరిత్ర ఉన్నది. అంటె సమైక్యాంధ్ర అప్పడి నుండీ దానికి గుదిబండగానె ఉన్నది.
ప్రస్తుత పరిస్థితులకు కారణాలేంది?
----ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ప్రజలలో ఉంటె టీఆరెస్ ఎందుకు ఓడి పోయింది ?
1)కేసీఅర్ మీద నమ్మకం లేక
2)కాంగ్రెస్, టిడిపి, పీఅర్పి పార్టీలు తెలంగాణకు అనుకూలం అన్నాయి. జనాలను గందరగోళ పరిచినారు. తెలంగాణ వాదనను వెనకకు నెట్టినారు.
3) ఒక విధంగా ఒట్లకు, ఇలాంటి సమస్యలకు సంబంధం లేదు. ఓట్లను అనేకం ప్రభావితం చేస్తాయి.
------కాంగ్రెస్, టిడిపి, పీఅర్పి పార్టీలు తెలంగాణకు ఎందుకు అనుకూలం అన్నాయి?
అందరికి కాంగ్రెస్ అధిష్టానం మీద నమ్మకం. ఆ నమ్మకం ఏంది - ఎట్టి పరిస్థితులలో సోనియా తెలంగాణ ఇవ్వదు. ఈ "నమ్మకం" పచ్చి నిజం. ఎంత అంటె కాంగ్రెస్ వాళ్లు చెప్పితె టిడిపి వాళ్లు నమ్మారు, టిడిపి వాళ్లు చెప్పితె కాంగ్రెస్ వాళ్లు నమ్మారు.
----మరి ఇప్పుడు కాంగ్రెస్ అంటె సోనియా తెలంగాణ ఎందుకు ఇస్తానన్నది?
పూర్తిగా రాజకీయ కారణం. వైఎస్సార్ పోయిండు. ఇంత పెద్ద రాష్ట్రాన్ని నడపగలిగే వేరే నాయకుడు ఇప్పుడు లేడు. బాబును ఎదుర్కొనె నాయకుడు లేడు. కనుచూపు మేర కనిపించడం లేదు.( అంటె తొందర పడ్డ జగన్ ఉన్నాడు. కాని విధేయత నిరూపించుకోవాలి. ఆయన పరిమితి ఆయనకు తెలయదని అధిష్టానం అనుకున్నది. చేతిలో ఉండే నాయకుడు కావాలి. ఇంకా కారణాలు చాలా ఉన్నాయి.) కాబట్టి బాబు సైజు తగ్గించాలి.
-----బాబు గురించి రాష్ట్రాని సోనియా ముక్కలు చెస్తదా?
చేస్తుంది. ఆయన కేంద్రం లొ చక్రం తిప్పుతుండు. ఆ మాటకు వస్తె చిన్న రాష్ట్రాలు చేస్తె ఈ బాబు, ములాయం, లాలూ లాంటి వాళ్ల తలనొప్పి పోతుంది. పెద్ద బలమైన ప్రాంతీయ పార్టీలు రాకుండా చూడాలి. అంటె చిన్న రాష్ట్రాలే మార్గం. బలమైన జాతీయ పార్టి కొరకు అవకాశం వస్తె ఇంకొన్ని చిన్న రాష్ట్రాలు ఇస్తారు.
----మరి సమైక్యాంధ్ర అంటు అన్ని పార్టీలు ఎందుకు గొడవ చేస్తున్నాయి?
అందరు పొరబడ్డరు. ఈ పరిస్థితి వస్తుందనుకోలేదు. దీనికి అందరు కారణమే. ప్రజల ముందు ఎవరు కారకులుగా (దోషులుగా) నిలబడాలి.
అందుకే ఒకరిని మించి ఒకరు గొడవ చేస్తున్నారు. ఇక మీరే కారణమంటె మీరే కారణమనే రోజు వస్తుంది.
------ సోనియా ఆంధ్రా ప్రజల మనోభావాలను ఎందుకు పక్కకు పెట్టింది? వారి మద్దతు ఆమెకు అవసరం లేదా?
ప్రత్యేక తెలంగాణ వల్ల ఆంధ్రా సామాన్య ప్రజానీకానికి పెద్దగా నష్టం లేదు. లెక్కలతొ సహ నిరూపనలు ఉన్నాయి. కాంగ్రెస్, టిడిపి రాజకీయ నాయకులకు, వారి అనుబంధ వ్యాపారరులకే కొంత నష్టం. కాని ఈ పరిస్థితి రావడానికి వీరే కారణం.
హైకమాండ్ ను నిందించలేరు. దీనికి మీరంటె మీరని నిందించుకొంటరు. ఇద్దరికి నష్టం. లాభం ఎవరికి లేదు. అంటె యధాతధ స్థితి.
------ ఇంతకు ఎవరి ఉద్యమం పలితాన్ని ఇస్తుంది?
తెలంగాణ చాల బలమైన ఉద్యమం. ఆంధ్ర ప్రభుత్వ పెత్తందార్ల, అధికార్లను ఎదిరించి ఎగుస్తున్న ఉద్యమం. అన్ని వర్గాలు కలిసి నడిపిస్తున్న ఉద్యమం. స్వచ్చంధం. త్యాగాలమయం.
ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం దానిని అనుకరిస్తుంది. కాని దానికి ఎన్నటికి సరిరాదు.

ఒక్క సంగతి
చిదంబరం, పిళ్లై, ఎంకె.నారాయణన్ అనే తమిలులు కుట్ర పన్నినారని, చెన్నైకి నీళ్లు బంద్ చేసినారు. అదే విధంగా తెలంగాణ వాళ్లు ఆంధ్రా రాయలసీమ వాళ్లను హైద్రాబాద్ రాకుండా అన్ని హైవేలను, రైలు మార్గాలను పూర్తిగా మూసివేస్తె వాళ్లు ఎన్ని రోజులు మనగలరు.
సమైక్యాంధ్రాకు జాతీయ స్థాయిలో వారికి మద్ధతు సున్న.

కారణాలేమైన తెలంగాణాకు విముక్తి కలుగుతుంది.
జై తెలంగాణ, జై జై తెలంగాణ

13, ఏప్రిల్ 2009, సోమవారం

సీట్లేందుకు అమ్ముడుపోతున్నాయి? ఓట్లెందుకు అమ్ముడుపోతున్నాయి?

దేశం కాదు, ప్రపంచం మొత్తం చూస్తుంది ఈ పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను.
ఆంధ్ర జ్యోతి శ్రీనివాస్ గారు అన్నారు "కాబోయె ఎమ్మెల్యేలు, ఎంపీలు సీట్లు కొంటున్నారు, ఓట్లు కొంటున్నారు. ?" ఇంత బహిరంగంగా జరుగుతున్నది ఈ అమ్మకం వ్యవహారం, కొనటం వ్యవహారం. ఈ సీట్లు, ఓట్లు కొనుక్కున్న ఎమ్మెల్యేలపై, ఎంపీలపై ఎవరికి(సీట్లమ్ముకున్న అధినాయకులకు , ఓట్లు అమ్ముకున్న ప్రజలకు) అధికారం ఉండదు, వారు దేనికి బాధ్యులు కారు. మనకు ఇది చాలా మామూలుగా అనిపిస్తుంది మామూలుగానైతె. కాని ఒక్క సారి ఇలాంటి మామూలు స్పృహనుండి బయటబడి ఆలోచిస్తే ఇది చాలా విచిత్రమైన, ఘోరమైన విషయం అనిపిస్తుంది.

ఇలా జరగటానికి కారణాలు, ఇలా జరగకుండా ఉండాలంటె ఏమి చేయాలొ చెప్పండి ఒకటి, రెండు వాక్యాల్లొ.

23, ఫిబ్రవరి 2009, సోమవారం

తెలంగాణా - ఆంధ్రా నిజాములు

మద్యన ఒక సారి ఒక బాలివుడ్ నటి మన తెలుగు నటుడు నాగార్జునను నిజామంత ఐశ్వర్యవంతుడు అంటు ఇంకా చాల చాలా తెగ పొగిడింది.

మద్యన నాగార్జున కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొరకు యాడ్ లొ నటిస్తె, ఏ లాభం కొరకో ( భూమికి సంబంధించినదని అనుమానం) ఇలా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నాడని విమర్శ వచ్చింది.దీనికి ఒకరు నాగార్జునకుడబ్బు అవసరం లేదు. డబ్బు కొరకు చేసెవాడు కాదని, నిజామంత ధనవంతుడనే విధంగా సమర్ధించినారు.

కావచ్చు.


నాగార్జున ఒక్కడె కాదు, వందలమంది నిజాం నవాబులంతటివాళ్లు హైద్రాబాదులొ ఉన్నరు.


వీరంతా తెలంగాణా రాకుండా వీలైన అన్ని విధాల ఆంధ్ర నాయకత్వానికి సహాయం చేస్తారు.ఉదాహరణకు తెలంగాణా పై ఏకాభిప్రాయం లేదనటానికి ఒక ఇరువై, ముప్పై మంది ఇతర రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులను కొని తెలంగాణాకి మేము వ్యతిరేకం అనిపించగలరు.


మన తెలంగాణా దౌర్బాగ్యం ఏందంటె,

మనవాళ్లు ఆనాడు 1947-49 లో నిజాం కి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించి అతడిని వదిలించుకున్నాము. జమిందారులను, భూస్వాములను పట్టణాలకు పారదోలినరు. కులాల అంతరాలు తగ్గినయి, దొరల పెత్తనం పొయింది.దాదాపుగా ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణ రూపుదిద్దుకుంటున్న తరుణం.


అప్పుడు 1956 లో మనకు ఆంధ్ర పెత్తందారులను (ఆంధ్ర ప్రజలు కాదు)తీసుకవచ్చి నిజాములను చేసి పైన కూర్చొపెట్టిండ్రు. ఒక్కడు పొయి వందల కొద్ది నిజాములు హైద్రాబాదుకొచ్చిండ్రు ఆంధ్రానించి. మన పాత పెత్తందారులు (రాజకీయ నాయకులుగా, పారిశ్రామిక వేత్తలుగా రూపాంతరం చెందినాజమిందారులు,భూస్వాములు )తిరిగి పాత పాత్రనె పోషిస్తున్నారు అంధ్రా నిజాముల కింద వుండి .కోస్తానించి కులగజ్జి, రాయలసీమనించి ఫ్యాక్షన్ (ముఠా రాజకీయాలు)బుధ్దులు అంటుకుంటున్నాయి. మన వాళ్ల పోరాటాలు, ప్రాణత్యాగాలు వృధా అయినాయి. మన బతుకులు మారలేదు.
ఇప్పుడు వందల మంది నిజాములను ఎదుర్కొనాలి.

25, జనవరి 2009, ఆదివారం

బాగుందనిపిస్తే దయచేసి తెలుగీకరించండి

ఎవరికైనా ఇది బాగుందనిపిస్తే తెలుగులోకి అనువాదం చేయండి.

Tapping the potential for harmonious co-existence

నిశీత్ శ్రీవాస్తవ

It has become somewhat passe, in recent memory, to take Gandhi’s socio-economic views too seriously. Even as globalisation putatively improves the standards of living of vast swathes of the erstwhile rural population, it would be a foolish voice indeed that would call out materialism in both its capitalistic and dialectic forms for the canard that Gandhi saw it to be. This panic, we must remember, has been caused for no other reason than bankers refusing to trust other bankers because other bankers were not trusting them because the tangled web of lies called leverage was getting too big to keep tossing around. Workers keep working, factories keep churning, the sun keeps shining, but the wheels of capitalism seem to have gone off the rails, as they seem to do about once every decade.And nowhere is the scene more poignant than in my present adopted land, the glorious land of the free and the home of the brave, who go about bombing people’s countries to smithereens anytime they get frightened by monsters under their bed. The American entrepreneurs’ faith in the strength of capitalism is almost touching to observe. Though the brave thinkers exclaim, ‘In every crisis there is an opportunity. The American dream will simply take on a newer shape, as it has always done.’ And yet, for all the bravado, a refreshing breath of change is sweeping through this land, for while the plutocracy is ever a slave to its own interests here, there are large sections of the general public in the U.S. that constitute without a doubt the most open-minded and intelligent of all the cultures in the world.Old paradigms fallHence, there is a deepening interest in building up economic systems based on survivability and sustainability rather than economies of scale. As the standard of living in the U.S. has reached a gentle asymptote and begun declining over the past couple of decades, the advent of the internet economy has broken the old paradigm of the necessity for hierarchy in production. Intellectuals and forward-thinkers here are increasingly pondering the future and finding that it lies in sustainable semi-rural communities, with a minimum of industrial production and great administrative autonomy. And even as my fellow NRIs flock into this golden land, eager to print professional degrees, mint money and date blonde women, there is a gradual but perceptible shift one finds in the American ethos: away from the alienation of a professional middle class ఎక్షిస్తెన్కెand towards a richer and more meaningful life premised on community and small-scale industry.The old assumptions do not hold any more in an era that is gradually progressing towards post-scarcity; government and industry are no longer needed to maintain peace. There was a village where two factions once put up a wall midway through, because the grand gentlemen who stood in front of them and called themselves ‘leaders’ decided that they were especially and solely chosen by the Great Big Chestnut Tree to lead their followers (and no others!) to a glorious future.Once the wall was put up, both sides had to try to raise it higher to keep the other side from looking over to see what they were doing. So, they told some of the people who had been quietly minding their own business to stop minding their own business and take shifts in building up the wall. While one faction decided to do so by promising to give them a lot of things they did not need, the other one persuaded them by preaching to them the value of honest self-subservience and submissive labour at the behest of authority.The walls have risen higher, but we are now running out of bricks. And even as we do, the villagers are realising the wisdom of what an old fool had told them long ago. That there is no real need to build walls, only fences for corn-fields and ditches for water. That professionalism is but a euphemism for slavery and that individual freedom and symbolic group identities are incompatible. That Gandhi was right. That small is beautiful.

10, జనవరి 2009, శనివారం

విద్యాయజ్ఞం - ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చూద్దాం

పాఠశాలలు లెవు.
తరగతి గదులు లేవు.
ఉపాధ్యాయులు లేరు.
5 తరగతులు ఒక ఉపాధ్యాయుడు.
4గురు విద్యార్ధులు-ఇద్దరు ఉపాధ్యాయులు.
ప్రభుత్వం విద్యకు సరిపోను నిధులు కేటాయించడం లేదు.
ఇవి మనం తరచూ వింటుంటాము.
మన రాష్ట్రంలో ఒక్క సారిప్రభుత్వపాఠశాలల, ఉపాధ్యాయుల, పిల్లల సంఖ్యలు చూద్దాం 2007-08 లో
పాఠశాలల సంఖ్య = 79860
ఉపాధ్యాయుల సంఖ్య=2.75 లక్షలు
విద్యార్ధుల సంఖ్య = 89 లక్షలు

పాఠశాలల, విద్యార్ధుల నిష్పత్తి = 1:111.44
ఉపాధ్యాయుల,విద్యార్ధులు నిష్పత్తి =1:32.36
DSC ద్వారా 50,000 ఉపాధ్యాయులను తీసుకొంటేఉపాధ్యాయుల సంఖ్య 3.25 లక్షలు .
అప్పుడు ఉపాధ్యాయుల, విద్యార్ధుల నిష్పత్తి =1:27.38
ప్రైవేట్ పాఠశాలల, ఉపాధ్యాయుల, పిల్లల సంఖ్య:
పాఠశాలల సంఖ్య = 17560
ఉపాధ్యాయుల సంఖ్య=1.65లక్షలు
విద్యార్ధుల సంఖ్య = 48లక్షలు
పాఠశాలల, విద్యార్ధుల నిష్పత్తి = 1:273.34
ఉపాధ్యాయుల, విద్యార్ధుల నిష్పత్తి =1:29.
దాదాపు ప్రభుత్వ, ప్రైవెట్ పాఠశాలలలొ ఒక ఉపాధ్యాయునికి 30 మంది విద్యార్ధులు ఉన్నరు. తేడా ఎక్కడంటె ప్రభుత్వం సరాసరిన 100 మంది విద్యార్ధులకు ఒక పాఠశాలను ఏర్పాటుచేస్తె, ప్రైవెట్ పాఠశాలలు 270 మంది విద్యార్ధులకు ఒకటి చొప్పున ఏర్పాటైనవి.
10 ఏండ్ల నుండి పాఠశాలలలో సౌకర్యాలు కల్పించటంలో పరోక్ష పాత్ర వహించుతున్నాను. కావున వాటి స్థితిగతులు చూస్తున్నాను.సర్వశిక్షాభియాన్ కట్టిస్తున్న స్కూళ్ళను చూస్తున్నాను. రెసిడెన్సియల్ స్కూళ్ళు చూస్తున్నాను. ఆ ఆ గ్రామాలలో వస్తున్నమార్పులను చూస్తున్నాను. ఉపాధ్యాయులను, పిల్లలను పరిశీలిస్తున్నాను.
పాఠశాలలలో జీవం లేదు. సరియైన, తగినన్ని తరగతి గదులు మరియు ఇతర మంచినీటి, మూత్రశాలల సౌకర్యాలు లేవు. ఉన్నా వాటి నిర్వహణ చాలా అధ్వాన్నం. ఉండవలసింతమంది ఉపాధ్యాయులు లేరు. ఉన్నవారిలో చిత్తశిద్ది లేదు. పిల్లలంతా నిరుపేదలే. దాదాపు అనాధలు అనవచ్చు.
ప్రభుత్వం తరగతి గదుల కొరకు ఇతర సౌకర్యాల కొరకు నిధులు కేటాయించడం లేదు అనడం లేదు.చదువు చెప్పనందుకు ఉపాధ్యాయులను తప్పు పట్టడం లేదు.పిల్లలు పేదవారు ఐనందుకు ఎవరిని కారకులు అనటం లేదు.
కాలం చెల్లిన విధానాలే ఈ పరిస్థితికి కారణం
30, 40 ఏండ్ల కు ముందు సరియైన రోడ్డు సౌకర్యాలు లేక అన్ని ఆవాసాలలో స్కూళ్ళు ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకోనినారు. ఎందుకంటే చాలామంది పిల్లలను పట్టణాలకు పంపించడం కంటే కొంతమంది ఉపాధ్యాయులను గ్రామాలకు పంపించడం సులభం. ఉపాధ్యాయులు తప్పని పరిస్థితులలో గ్రామాలలో ఉండవలసి వచ్చేది. అట్టి పరిస్థితులలో కూడా పిల్లలు హైస్కూలు చదువు కొరకు రోజు 7,8 కి. మీ. వెళ్లి చదివేవారు. ఈ 7,8 కి.మి.దూరం తగ్గించడానికి దాదాపు కొద్దిగా పెద్దగా వున్న గ్రామాల అన్నింటిలో హైస్కూళ్ళు ఏర్పాటు చేస్తూవస్తున్నారు.
ఇది వికేంద్రీకరణ. పలితాలు కొంత కాలం మంచిగానే ఉన్నవి. ఈ వికేంద్రీకరణ ఎక్కువైనది పలితాలు ప్రతికూలంగా వస్తున్నాయి. సంఖ్యలో పిల్లలకనుగుణంగా స్కూళ్ళు పెరిగినాయి. ఉపాధాయులు పెరిగినారు. కాని సంఖ్యలలో సమన్వయము లేదు. పర్యవేక్షణ సంఖ్యల సరిచూసుకొనుటకే సరిపోతున్నది.
ఇది అప్పటి అవసరం.
ఇప్పుడు రోడ్డు సౌకర్యాలు, వాహనాల లభ్యం పెరగడం వల్ల ఉపాధ్యాయులను గ్రామాలలో ఉంచలేని పరిస్థితి. కావున వారు పట్టణాలలో స్థిరపడి రోజు పాఠశాలలకు 70, 80 కి. మీ. దూరం పోయు వస్తున్నారు.ఇది భోధన మీద తప్పక చెడు ప్రభావం చూపెడుతుంది.దీనికి ఎవరిని నిందించడం లేదు. పట్టణీకరణ పెరుగుతున్నది. ఇది కొన్ని మార్పులకు అనుగుణంగా సహజంగా జరిగే మార్పు. ఈ మార్పుకు తగిన మార్పులను ఆశ్రయించాలి.
కాబట్టి ఇప్పుడు కేంద్రీకరణ చేయాలి.అంటే పాఠశాలల సంఖ్యను తగ్గించాలి.ఉపాధ్యయుని వద్దకు పిల్లలు వెల్లక తప్పదు. ఇతర వివరాల కొరకు తరువత posting చూద్దాం.

22, డిసెంబర్ 2008, సోమవారం

చదువు విలువ

హిందూ లో ఓపెన్ పేజి లో వచ్చిన ఆర్టికల్ ఇది.
Date:21/12/2008 URL: http://www.thehindu.com/thehindu/op/2008/12/21/stories/2008122150011400.htm

Why not strive to reach for the stars?
MAHMOOD BIN MUHAMMAD
Education holds the key to Muslims’ development
An interesting question is now doing the rounds of the internet under the caption “The Powerful and the Powerless”. The question is: “Why are the 14 million Jews so powerful and the 1.4 billion Muslims so powerless?”. Dr. Farrukh Saleem answers the question in one word — ‘education’. His answer is supported by hard facts and figures.
Over the past 105 years, 14 million Jews have bagged 15 dozen Nobel Prizes while only three Nobel Prizes have been won by 1.4 billion Muslims (other than Peace Prizes). The “most influential scientist of all time” Albert Einstein and Time Magazine’s “Person of the Century” and father of psychoanalysis Sigmund Freud were Jews. So was Karl Marx. Madeline Albright, Noam Chomsky and William James Sidis, with an IQ of 250-300, “the brightest human who ever existed,” are some of those of the Jewish faith.
The most beneficient philanthropist in the history of the world is George Soros, a Jew, who has so far donated a colossal 4 billion dollars, most of which has gone as aid to scientists and universities around the world. Second to George Soros is Walter Annemberg, another Jew, who has built a hundred libraries donating an estimated 2 billion dollars. In the media, the famous Jews include Wolf Blitzer (CNN), Barbara Walters (ABC News), Eugene Meyer (Washington Post), Henry Grunwald (editor-in-chief, Time), Katherine Graham (publisher of Washington Post) and Joseph Lelyyeld (ex-editor, New York Times). In sharp contrast, every fifth human being is a Muslim. For every single Hindu, there are two Muslims and for every Jew there are one hundred Muslims. Reasons for the plight
According to UNDP data, literacy in the Christian world stands at 90 per cent and 15 Christian majority States have a literacy rate of 100 per cent. Muslim majority States, as a sharp contrast, have an average literacy rate of 40 per cent and there is no Muslim majority State with literacy rate of 100 per cent. Some 98 per cent of literates in the Christian world had completed primary school, while less than 50 per cent of the literates in the Muslim world did the same. Around 40 per cent of the literates in the Christian world attended university while no more than 2 per cent of the literates in the Muslim world did the same.
Muslim majority countries have 230 scientists for one million Muslims whereas the U.S. has 4,000 scientists per million and the Japanese 5,000 per million. In the entire Arab world, there are 35,000 full-time researchers and 50 technicians per million Arabs whereas in the Christian world there are 10,000 technicians per million. The Muslim world spends a meagre 0.2 per cent of its GDP on Research & Development while the Christian world spends 5 per cent of the GDP on R & D. The conclusion is that the Muslim world lacks the capacity to produce, diffuse and apply knowledge, and the only source of knowledge is research.Research is the key
Allah’s very first command in the Koran is to acquire knowledge and to cultivate the scientific temper. Allah has given all human beings the capacity not only to explore and use material knowledge but also gain spiritual knowledge. The Koran attaches great importance to “reflection as a means of gaining insight.” The constant prayer of every person has, therefore, to be: “My Lord, increase me in knowledge.” (20:114).The scenario in India, which has the largest Muslim minority and the second largest Muslim population in the world, is a replica of the world situation, but the biggest reason for Muslim educational backwardness here, as affirmed by the National Commission for Minorities, is “the gradual dilution and suppression of the rights guaranteed under the Constitution.” The Sachar Committee has also highlighted the sad plight of Muslims.
If the attitude of the majority community, post-Independence has created a “siege mentality” among Muslims, the “crisis of non-implementation” of promises and programmes announced over the years is attributed to an unconcealed “political hypocrisy” of all ruling parties. If the Muslims realise that Islam is not just a pillow to rest upon but a belt to be girdled, so that they are in a better position to strive for excellence in a competitive society, no power on earth can stop them from reaching for the stars! Our own A.P.J. Abdul Kalam and America’s Barrack Hussain Obama have shown the way.
© Copyright 2000 - 2008 The Hindu

ఇది ప్రపంచ ముస్లిములకు ఎంత వర్తిస్తుందో , అంతకంటే ఎక్కువ భారతీయులకు వర్తింస్తుంది. మనకు కావాల్సింది ఆంధ్ర ప్రదేశ్ లో జలయజ్ఞం కాదు. విద్యాయజ్ఞం. దీనిని కామన్ స్కూల్ విధానంతో మొదలు పెట్టితే బాగుంటుది. అప్పుడే నిజమైన అభివృద్ది చెందినా రాష్ట్రం /దేశం కాగలదు.

13, డిసెంబర్ 2008, శనివారం

మార్పు - వ్యవస్థల వికేంద్రీకరణ


మార్పు

మార్పు అంటె ఏమిటి?

మార్పు ఎలా వస్తుంది?

మార్పు అంటె ముందుకు వెళ్ళడం.మార్పు అనేది సహజంగా వస్తుంది.

మనిషి ప్రమేయం మార్పులో ఎంత వుంటింది?

మనిషి మార్పుకు దిశా నిర్దేశం చేయగలడు.

చిరంజీవి చెప్పే మార్పు ఏమిటి?

సమసమాజం, సామజిక న్యాయం, అవినీతి నిర్మూలన, గ్రామస్వరాజ్యం.

పైన చెప్పినవి వేరువేరు సమస్యలా?

ఏవిధంగా ఈ మార్పు తెస్తాడు?అతను చేయవలసినది ఏమిటి?

దిశా నిర్దేశం

సమసమాజం

అంటె ఏమిటి?

సాధ్యమా?

సమసమాజం అంటె ఆర్దిక, సామజిక సమానత్వం. ఇవి పూర్తిగా సాధ్యం కావు. సాధిస్తే పురోగతి ఆగుతుంది. అసమానతలే పురోగతికి ఆలంబన. అదేవిధంగా తీవ్రమైన అసమానతలు అశాంతికి దారి తీస్తాయి. ఏమి చేయాలి? అసమానతలు తగ్గించాలి. దానికి సమాన అవకాశాలూ కల్పించాలి. సమాన అవకాశాలూ అంటె ఏమిటి? సామజిక, ఆర్ధిక స్థాయిల ప్రమేయం లేకుండా అందరికి ఒకే విధమైన విద్యావకాశాలు కల్పించాలి.

సామాజిక న్యాయం

అంటే ఏమిటి? సాధ్యమా?అన్ని సామజిక వర్గాలకు (కులాలకు)పరిపాలనలో భాగం ఇవ్వాలి. అంటె పంచుకోవటం. అంటె అరాచకం. కుల వృత్తులు నశించినప్పటికి ఈ గ్రామీణ వ్యవస్థ వున్నప్పుడు సామజిక వర్గాలు ఉంటాయి. మరి ఏమి చేయాలి? వర్గాలు (కులాలు)అంతరించాలి. అంటె గ్రామీణ వ్యవస్థను పునర్నిర్మాణం చేయాలి. అంటె పట్టణీకరణ. నగరీకరణ కాదు. నగరీకరణ అంటె అవినీతికి ఆలంబన. గ్రామాలను యధావిధిగా వుంచడం అంటె కులాల ఉనికిని కాపాడటం. పట్టణ స్థాయిలో కుల వివక్ష తగ్గుతుంది. వర్గాల ఉనికి నశిస్తుంది.రెడ్ల రాజ్యం పోవాలి. కమ్మల రాజ్యం పోవాలి. మనుషుల రాజ్యం రావాలి.

అవినీతినిర్మూలన

అవినీతి అంటే ఏమిటి?అవినీతికి సరియైన నిర్వచనం చెప్పటం కష్టమైన పని . విధి నిర్వహణ చేయటానికి డబ్బు తీసుకుంటేనే అవినీతి అనేది ప్రచారంలోఉన్నది. చాలా ప్రభుత్వ విధానాలే అవినీతికరమైనవిగా వున్నాయి, అవినీతికి అవకాశమిచ్చే విధంగా వున్నవి. ప్రాధాన్యత లేని వాటికీ డబ్బు ఖర్చు పెట్టడం కూడా అవినీతి అనవచ్చు. కానీ వీటికి ప్రమాణాలు ఎవరు నిర్దేశించాలి? ప్రభుత్వ డబ్బు దోచుకునే వ్యక్తికి గౌరవంగా బ్రతికే అవకాశం వున్నది. ప్రభుత్వ డబ్బు ఎవరికీ చెందనిడిగా జనం అనుకుంటున్నారు. కారణం ప్రభుత్వం చాలా పెద్ద వ్యవస్థగా వుండటం. పెద్ద నగరాలు ఏర్పడటం. ప్రభుత్వ డబ్బును దోచుకుంటే ఎవరికీ వ్యక్తిగతంగా నష్టం అనే భావన లేకుంట పరిస్థితి ఏర్పడింది. అవినీతి పెరగటానికి ఇంకొక ముఖ్య కారణం నగరాలలో భూమి విలువ పెరగటం. అవినీతికి సూచిక భూమి ధరలు.ఏమి చేయాలి ?చిన్న వ్యవస్థలు ఏర్పాటు కావాలి. స్థానిక సంస్థలను మనగలిగే స్థాయిలో ఏర్పాటు చేయాలి.ఆర్ధిక వ్యవహారాలు వారికే అప్పగించాలి. అంటే బడ్జెట్ రూపకల్పన వారికే అప్పగించాలి.ప్రజలు వారి ప్రాధాన్యతలు వారె గుర్తించి వారె ఖర్చు చేసుకోవాలి. ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు అనే స్పృహ కలిగేవిధంగా పరిస్థితి రావాలి.

గ్రామస్వరాజ్యం

గ్రామస్వరాజ్యం అంటే ఏమిటి? గ్రామం తన అవసరాలు తనే తీర్చుకొనే విధంగా వుండాలి. ఇది సాధ్యమా?దేశ స్వరాజ్యమే సాధ్యం కాదు అనే పరిస్థితిలో గ్రామస్వరాజ్యం గురించి ఏమి చెప్పాలి? సాంకేతిక అభివృద్ది అనేది ఆ పరిస్థితి తేచ్చినది అనిపిస్తుంది. సాంకేతిక అభివృద్ది అనేది పెద్ద వ్యవస్థల ఏర్పాటుకు కారణమైనది. అంటే అర్బనైజషన్. దానినే ఇప్పుడు గ్లోబలైజేషన్ అనవచ్చు.ఇప్పుడున్న గ్రామాలూ ఏవిధంగా మనలేవు. పట్టణాలు కొంతవరకు మనగలవు. వాటి అస్తిత్వం గుర్తించవలసిన స్థాయిలో వుంటుంది. ఇతరులతో ఇచ్చుపుచ్చుకొనే విషయంలో స్పష్టత వుంటుంది. మనిషికి నాగరిక అవసరాలు అనేవి పట్టణ స్థాయిలో తక్కువ వనరులతో సమకూర్చుకోవచ్చును.కావున పట్టణీకరణ కావలసిన అవసరం వున్నది.

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఏమి చేయాలి?

మార్పుకు నాంది ఎలా మొదలు పెట్టాలి?

పట్టణీకరణ జరపాలి.

అంటే మండల స్వరాజ్యాలు ఏర్పాటు చేయాలి. మనగలిగే చిన్న వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.

మార్పుకు నాందిగా విద్యావ్యవస్థను మండల స్థాయిలో కేంద్రీకృతం చేయాలి. ప్రైవేట్ పాఠశాలలను రద్దు చేయాలి .పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యా సౌకర్యం 12 వ తరగతి వరకు కల్పించాలి. మండల స్థాయిలో 2లేదా౩ పాఠశాలలు (శిశు నుండి 12తరగతి వరకు ) హాస్టలు వసతితో 5కి. మీ. పరిధిలో మండల కేంద్రం లోనే ఏర్పాటు చేయాలి. మండల కేంద్రాన్నే పట్టణంగా అభివృద్ది చేయాలి. గ్రామాలలో అవసరమైన చోట అంగనవాడి కేంద్రాలు (శిశు నుండి ౩ వ తరగతి )ఏర్పాటు చేయాలి. గ్రామాల నుండి మండల కేంద్రానికి రోడ్డు సౌకర్యాలు అభివృద్ది చేయాలి.పాఠశాలలో ఇంటర్నెట్ లాంటి అన్ని అధునాతన సౌకర్యాలు కల్పించి పాఠశాలను మరియు హాస్టలు ను సమర్ధవంతంగా నడపించాలి.అందరికి సమాన విద్యావకాశాలు కల్పించాలి. కోటీశ్వరుడు మరియు రోజు కూలి పిల్లలు ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో ప్రక్కప్రక్కన కూర్చునే పరిస్థితి కల్పించాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి ఇలాంటి పాఠశాల తో సంబంధం ఏర్పడాలి. మనం ఒక సమాజంలో వున్నామనే భావనకు ప్రస్తుతం మనకు ఎలాంటి బంధం లేదు. ఎందుకంటే కులాలు ఒకటి కావు, మతాలు ఒకటి కావు. వ్రుతులు వేరు. ఆర్ధిక స్థితిగతులు వేరు. బాష తప్ప. (పరిస్థితి యధావిదిగా కొనసాగితే భాష గూడా వేరవ్వుతుంది)గ్రామాల నుండి మండలాలకు వలసలు ప్రోత్సహించాలి. నగరాలకు వలసలను తగ్గించాలి. ప్రతి అభివృద్ది పనికి మండలాన్ని యూనిట్ గా తీసుకోవాలి. మండల స్థాయి పట్టణంలో ఆరోగ్యకర పట్టణ మరియు పల్లెటూరి వాతావరణ పరిస్థితులు కల్పించాలి.ఎన్ టీ ఆర్ తెచ్చిన మార్పుకు కొనసాగింపుగా మండలాలలో స్వరాజ్యాలు ఏర్పాటు చేయవచ్చు. 15 ఏండ్లలొ చాలా మార్పును తేగలం.

Above structural adjustment will create human growth engines. We do not need material growth engines.

మిగతా మార్పులు తదనుగుణంగా వస్తవి.