ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపి, టిడిపి లకు ఆర్ధిక విధానాలలో మౌలికమైన తేడాలేమిలేవు. 1947 నుండి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి క్రమానికి అవి ఇచ్చె వివరణ దాదాపు ఒక్కటె. మంచి, చెడుల జోలికి వెళ్లకుండ, అంకెల జోలికి వెళ్లకుండ క్లుప్తంగా చెప్పితె ఆ పరిణామ క్రింద చెప్పిన విధంగా వుంటుంది.
ఎంత తక్కువ శాతం జనాభా వ్యవసాయం చేస్తె దేశం అంత అభివృద్ధి చెందినదిగా అర్దికవేత్తలు, దేశాధినేతలు గుర్తిస్తున్నారు. అంటె జనాభాను వ్యవసేతర రంగాలకు మరలించాలి. (వ్యవసాయం అంటె కుల వృత్తులను కలుపుకొని)
భారత దేశం జనాభా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడుతుంది. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ జనాభా కూడా వ్యవసాయం మీదే ఆధారపడుతుంది. అందులో తెలంగాణ ప్రాంత జనాభా ఇంకా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడుతుంది.
స్వతంత్రం వచ్చిన తరువాత ఈ అభివృద్ధి క్రమం ఎలా జరిగింది?
స్వతంత్రం వచ్చేనాటికి జనాభా చాలా ఎక్కువగా వ్యవసాయం మీద అధారపడుతుండేది. అభివృద్ధి జరగాలి అంటె వ్యవసాయం చేసే జనాభా తగ్గాలి. జనాభా ఇతర (పారిశ్రామిక, సేవ) రంగాలకు మరలాలి. ఇదే సమయం లో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గవద్దు. అంటె వ్యసాయ ఉత్పాదకత పెరగాలి. దీనికి నీటిపారుదల ప్రాజెక్టులు కట్టాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అమలు చెయ్యాలి. పారిశ్రామిక, సేవా రంగాల అభివృఇద్ధి జరగాలి అంటె అవసరమైన మానవవనరులు కావాలి. అంటె విద్యా, వైద్యావకాశాలు కల్పించాలి. ఇవన్ని చేయాలంటె పెట్టుబడులు కావాలి. కాని ప్రజల వద్ద పెట్టుబడులు లేవు. కావున వ్యవసాయ, విద్య, వైద్య, పారిశ్రామిక, సేవా రంగాలలో ప్రభుత్వం మాత్రమే అధికంగా పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేస్తూ వచ్చింది. అదే సమయం లొ అట్టడుగు వర్గాల కొరకు సంక్షేమ పథకాలు అమలు చేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెరగడం వలన, మానవ వనరుల అభివృద్ధి (ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉపాధి అవకాశాలు) వలన జనాభా క్రమంగా ఇతర రంగాలకు తరలుతూ వచ్చినది. ఈ క్రమంలోనె ప్రజల వద్ద కొంత పెట్టుబడులు పోగై, పెట్టుబడులు పెట్టే స్థాయికి వచ్చినారు. ఇది 1947 నుండి 1990 వరకు జరిగినది. అప్పుడే సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలు మొదలు పెట్టినారు. క్రమంగా ప్రభుత్వం అన్ని రంగాలలొ పెట్టుబడులు తగ్గిస్తు, ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తు వస్తున్నది.
అంటె ప్రభుత్వం వ్యవసాయానికి, విద్యకు, వైద్యానికి, ఉపాధికి ఇచ్చిన తోడ్పాటు వలన ప్రజలు అన్ని
రంగాలలో అభివృద్ధి చెందినారు.
అంటె మౌలికమైన విద్య, వైద్య చివరకు వ్యవసాయం తొ సహ అన్ని రంగాలకు అవసరమగు పెట్టుబడులు, మానవవనరులు సమాజానికి వనగూరినాయి. అంటె సర్వస్వతంత్రం అవుతున్నది. అంటె ప్రజలకు దాదాపు సమాన అవకాశాలు వచ్చినాయి.
ప్రభుత్వం – పెట్టుబడులు
వ్యవసాయం
విద్య
వైద్యం
పారిశ్రామీకరణ
సమాజం - పెట్టుబడులు
వ్యవసాయం
సమాజం - పెట్టుబడులు
విద్య
సమాజం - పెట్టుబడులు
వైద్యం
సమాజం - పెట్టుబడులు
పారిశ్రామీకరణ
సమాజం - పెట్టుబడులు
వ్యవసాయం
---------------
---------------
ఒక వలయం ఏర్పడినది ప్రభుత్వం లేకుండ
ఇప్పుడు డబ్బు ఉంటె ఏ చదువైన చదువవచ్చు. పెట్టుబడి ఉంటె ఏ వ్యాపారమైన, పరిశ్రమైన, సెజ్ అయిన పెట్టుకోవచ్చు. ఇక్కడ కుల, ప్రాంత బేధాలు లేవు. ప్రభుత్వ పాత్ర ఒక సంధానకర్త గానె ఉంటుంది. ప్రకృతి వనరులను కేటాయిస్తుంది.
ఇప్పుడు డబ్బు ఉంటె ఏ చదువైన చదువవచ్చు. పెట్టుబడి ఉంటె ఏ వ్యాపారమైన, పరిశ్రమైన, సెజ్ అయిన పెట్టుకోవచ్చు. ఇక్కడ కుల, ప్రాంత బేధాలు లేవు. ప్రభుత్వ పాత్ర ఒక సంధానకర్త గానె ఉంటుంది.
అంటె ఇప్పుడు ప్రాంతీయ వివక్ష, ఏర్పాటు వాదాలు కాలం చెల్లిన విషయాలు.
తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అర్థం లేనిది.
అందరం పోటిబడవలసినదె.
తెలంగాణ, సీమాంధ్ర తేడా లేదు. పోటి బడాలి.
అవకాశాలు ఉన్నాయి. కాని అందనివి. అందుకోలేనివి.
కాని 1947-2010 మద్య తెలంగాణ ప్రాంతానికి అందవలసిన ప్రభుత్వ తోడ్పాటును సీమాంధ్రులు అందుకున్నారు. తెలంగాణా వనరులను ఆక్రమించినారు. విద్యావకాశాలు లేవు. వ్యవసాయానికి నీళ్ళు లేవు. ఉద్యోగాలు లేవు.
1947-2010 మద్య తెలంగాణా కు ప్రభుత్వం లేదు. ప్రభుత్వ సహాయం లేదు.
పెట్టుబడులు లేవు.
అవసరమైన మానవవనరులు లేవు.
దాదాపు మనం ఇంకా 1950 లోనే ఆగిపోయాము.
సీమాంధ్రులతో పోటిపడ లేము.
అందుకే మనకు 1947-90 విధానాలు కావాలి.
అందుకె తెలంగాణ కావాలి.